Friday, February 13, 2009

దశ రూపకం- ౯ వ (తొమ్మిదవ) భాగం

మందపిల్లి.
౦౫ -౧౨ -౩౮ .

రసరాట్టు గారూ! క్షమించాలి. మా నాన్న గారు ఉత్తరం రాసారు. రేపో నేడో ఇక్కడికి వచ్చేస్తార్ట. ఒక పని జరిగిందట. నాలుగైదు రచనలు మానాన్నగారు తమ బోంట్లకి విడివిడిగా అభిప్రాయంకోసం పంపించారట.అందులో ఒకటి శ్రీనాధుని రచన కూడా ఉందట. కడం అభిప్రాయాలన్నీ వచ్చేశాయి. ఒక వేళ, దిక్కుమాలి ప్రాలుద్ధం,మీకు నే పంపింది అదే కావచ్చు!
ఇట్లు,
గోపి.


జవాబు
పేరారం,
౦౬ -౧౨ -౩౮
గోపీ! అదా కమామిషూ! హోరీ! చెప్పవేం మరీ! అందుకనే, కిందన మాటు నేనెంత ఏకుతూ రాసినట్టు ఉన్నా,అప్పుడు కూడా ఈ రచనలోని ఆ రసస్ఫూర్తీ, ఆ పద సౌష్ఠవమూ, ఆ భావ విశేషమూ, ఆ గుఱ్ఱపునడకా, ఆ భాషామేళవం, ఆ వగైరాలూ - అవన్నీ తొంగిచూస్తూనే ఉన్నాయి. పెద్దవాళ్ళ రచనలు అనేకం ఇతరుల చేతుల్లో పడి పాడైపోయాయి.
ఇట్లు,
రసరాట్

No comments: