Monday, May 12, 2014

హనుమజ్జయంతి,హనుమద్రక్షాయాగంలో స్వామి అభిషేకమునకై మీతరపున ఒక అభిషేక కలశం సమర్పించండి


జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!


హనుమత్ రక్షాయాగం పూర్ణాహుతి అనంతరం నూటాఎనిమిది కలశజలములతో స్వామికి అవబృథస్నానం నిర్వహించబడుతుంది.

అందుకోసం నూటా ఎనిమిది కలశములను నూటాఎనిమిదిమంది భక్తుల తరపున సుగంధద్రవ్యములతో గంగాజలంతో నింపి గంగాది దివ్యనదులను ఆవాహనచేసి పూజించి ఋత్విక్కులు సిధ్ధపరచి ఉంచుతారు. పూర్ణాహుతి అనంతరం జాగంలో పాల్గొన్నవారు, ఎవరైతే యాగమునకు ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా తమతరపున స్వామి అభిషేకమునకు కలశములఏర్పాటుచేయమని కోరుతారో వారి తరపున పురోహితులు అభిషేకం నిర్వహిస్తారు.

ఒక్కొక్క కుటుంబతరపున ఒక్కొక్క కల్శము ఏర్పాటు చేయటం జరుగుతుంది. అందులో ప్రస్తుతం అన్నపూర్ణభిక్షాశాల నిర్మాణంలోనూ,ఈసంవత్స్రరం జరుగుతున్న హనుమత్ రక్షాయాగంలోనూ తమ పురుషార్ధములను సమర్పించినవారితరపున కలశస్థాపన జరుపగా మిగిలిన సంఖ్యలో కలశస్థాపనకు భక్తులకు అవకాశం కల్పించబడుతుంది. ఇందుకోసం ఒక్కో కలశస్థాపనకు 1116/- .పురుషార్థంగా సమర్పిమ్చవలసి ఉంటుంది. వారి తరపున హనుమజ్జయంతి రోజు అర్చన,పూర్ణాహుతి సమయంలో అభిషేకం నిర్వహించి స్వామి వారి రక్షలు ప్రసాదం పంపబడుతుంది. ఇతరదేశాలకు పంపుటకుమాత్రం కొరియర్ చార్జీలు వారేభరించవలసిఉంది.
ఇది కేవలం స్వామిసేవలో పాల్గొనే అవకాశం అందరికీ కల్పించి ఈ ద్రవ్యమున ఈయాగంలో అర్చనలకు,అన్నదానమునకు ఉపయోగించబడతాయి. ఇందులో భక్తిని వ్యాపారంగా మార్చే ఎటువంటి కలిప్రభావపు ఆలోచనలు లేవని తెలియపరుచుకుంటున్నాము.

తమతరపున కూడా కలశస్థాపన అర్చన జరిపించుకోదలచుకున్న వారు మెయిల్,లేదా ఫోన్ ద్వారా సంప్రదిస్తే వారికి ఎక్కౌంట్ నంబర్ తెలియపరుస్తాము.
జైశ్రీరాం


భక్తజనపాదదాసుడు
దుర్గేశ్వర
durgeswara@gmail.com
9948235641



Manohar Chenekala

Monday, May 5, 2014

హనుమత్ రక్షా యాగమునకు మీ గోత్రనామాలు పంపండి

http://durgeswara.blogspot.in/2014/05/blog-post.html

ఓం గం గణపతయే నమః

శ్రీ సీతాసమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః

ఓం హం హనుమతే నమః

ఆస్తికలోకమునకు శిరసా వందనము.

భగవద్బంధువులారా ! శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం గత ఆరుసంవత్సరములుగా హనుమత్ రక్షాయాగం అను పేరున భక్తజనావళికి ఆంజనేయస్వామి రక్షకలగాలని కోరుతూ యాగము నిర్వహించటం జరుగుతున్నది. ఇప్పటికి ఐదు ఆవృతులు పూర్తి చేసుకుని ఆరవ ఆవృతి గా భక్తజన సంరక్షణార్థం ఇరవైనాలుగు కోట్ల రామనామ లేఖన సహితంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీ శనివారం [,వైశాఖ బహుళదశమి ,శనివారం] యాగం పూర్ణాహుతి జరుపబడుతున్నది. ఇప్పటివరకూ జరిపిన ఐదు ఆవృతులలో నిష్ఠగా నియమానుసారంగా స్వామిని ఉపాసించినవారికి అనేక శుభములు ప్రాప్తించాయి. జీవితంలో సమస్యలు ,ఆర్ధిక ఇబ్బందులు ,సాంసారిక ఇక్కట్లు తొలగి సంతాన, .ఉద్యోగ, ఆరోగ్య, ఆథ్యాత్మిక లాభాలు ప్రాప్తింప జేసుకున్నవారు అనేకమంది స్వామి కృపకు ఉదాహరణలుగా కనపడుతున్నారు.


ముందుగా భక్తులు తమ గోత్రనామాలను మెయిల్ ద్వారా తెలియపరచాలి. గోత్రనామాలు పంపినవారందరి తరపున సంకల్పాదులు చెప్పి వారి తరపున కూడా ఆహుతులివ్వబడతాయి. ఇందుకోసం ఎవరూ ఏమీ చెల్లించవలసిన పనిలేదు.

ఈ యాగంలో పాల్గొనదలచుకున్నవారు [ప్రత్యక్షంగా లేక పరోక్షంగా] యాగం పూర్ణాహుతి దాకా సాధ్యమైనంత సంఖ్యలో హనుమాన్ చాలీసా పారాయణం, శ్రీరామనామ జపము చేయాలి. యాగంలో స్వయంగా పాల్గొనదలచినవారు పదకొండు రోజులపాటు, బ్రహ్మచర్య పాలన, మాంసాహారం,మద్యం,గుడ్డు భుజించటం పొగత్రాగటం లాంటివాటికి దూరంగా ఉండాలి. వారు ఇరవై మూడు[హనుమజ్జయంతి రోజు సాయంత్రమునకల్లా పీఠానికి చేరుకోవాలి. వారికి భోజనవసతి సౌకర్యములు [మాఅందరితోపాటు] కల్పించబడతాయి. స్వయముగా యాగమునకు రాలేనివారు ఇంటివద్దనే ఈ నియమాలు పాటించవచ్చు. వారు తమ జపసంఖ్యను ఎస్. ఎమ్. ఎస్. ద్వారా తెలుపవలసి ఉంటుంది .
ఇప్పటికే రామనామ లేఖనం ప్రారంభించి పూర్తిచేస్తున్నవారు మే ఇరవై కల్లా పీఠమునకు చేరేలా కొరియర్ లేక పోస్ట్ ద్వారా పంపించగలరు.

ఎవరైనా యాగంలోను, అన్నప్రసాద వితరణలోనూ తమ వంతు పురుషార్థములు సమర్పించాలనుకుంటే ఇక్కడ మెయిల్ ద్వారాగాని లేక దిగువన ఇస్తున్న నంబర్ లోగాని సంప్రదిస్తే వారికి బాంక్ ఎక్కౌంట్ నంబర్ తెలుపబడుతుంది. దానికి సంకల్పించిన సహాయం అందజేయవచ్చును పూలు,ఆకులు,పండ్లు ప్రసాదములు,యాగద్రవ్యములు, ఇలా ఏఏ ద్రవ్యాలకగు ఖర్చును భరించాలనుకున్నా వారి తరపున ఆయాద్రవ్యాలు తెప్పించి యాగంలో ఉపయోగించటం జరుగుతుంది..[ఇది కేవలం వారి ఇచ్చానుసారం అందించవలసిన సేవ. ] ఇలాపాల్గొనేవారందరికీ వారి ఖర్చులతో యజ్ఞ ప్రసాదములు పోస్ట్ లో పంపబడతాయి.
ఇప్పడు జరుగుతున్న అన్నపూర్ణ భిక్షాశాల నిర్మాణం లో ఇప్పటికే తమ సహాయాన్ని అందించినవారు ఏమీ పంపవలసిన పనిలేదు.


గోత్రనామాలు పంపవలసిన చిరునామా

durgeswara@gmail.com


9948235641

శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం
రవ్వవరం [పో]
నూజండ్ల మండలం
గుంటూరు జిల్లా
పిన్ 522660

rute హైదరాబాద్ టు ఒంగోలు వయా వినుకొండ _ ఉల్లగల్లు బస్ తెల్లవారు జామున నాలుగు గంటలకల్లా పీఠం దగ్గర దింపుతుంది [టిక్కెట్ మాత్రం ఉల్లగల్లువరకు తీసుకోవాలి]
స్వంతవాహనాలలో వచ్చేవారు హైదరాబాద్_ నాగార్జునసాగర్_ మాచర్ల- కారంపూడి- వినుకొండ- రవ్వవరం
మొత్తం ఆరుగంటల ప్రయాణం [ వినుకొండ దాకా బస్సులలో వచ్చి అక్కడనుండి పీఠానుకి వేరే బస్సులో చేరవచ్చు]

ఇక విశాఖ,విజయవాడ వైపునుండి వచ్చేవారు ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో నేరుగా వినుకొండలో దిగవచ్చు
విజయవాడనుండి గుంటూరు మీదుగా హైవే లో వినుకొండ చేరవచ్చు.

రాయలసీమ వైపునుండి వచ్చేవారు కర్నూల్- విజయవాడ హైవే పైన వినుకొండ లోనే దిగవచ్చు.
బెంగళూర్ నుండి ,వచ్చే ప్రశాంతి, యస్వంతపూర్ ట్రైన్ లు వినుకొండలో ఆగుతాయి .
నెల్లూరు ఒంగోలు వైపునుండి వచ్చేవారు ఒంగోలునుండి అద్దంకి చేరుకుని అక్కడ నుండి దరిశి రూట్ లో ఉల్లగల్లు స్టేజ్ లో దిగి రవ్వవరం చేరుకోవచ్చు.

ప్రయాణంలో ఏ అనుమానం వచ్చినా ఫోన్ లలో సంప్రదించండిః యాగంలో పాల్గొనేవారంతా కలసి ఉంటాము, కలసి భుజిస్తాము , కనుక విలువైన ఆభరణములను ,వస్తువులను తెచ్చుకోవద్దని మనవి.
ఇక ఆహారవిషయంలో ఎవరి నిష్ఠకూ భగం కలుగని రీతిలో ఏర్పాటు చూస్తాము కనుక ముందుగా తెలిపితే వారి ఆచారానికనుగుణంగా భోజన ఏర్పాట్లు చేయటం జరుగుతుంది.
contact no.
9948235641
9180204554
9010402119
 
భక్తజనుల సేవలో
దాసుడు
దుర్గేశ్వర


జైశ్రీరాం

Friday, May 2, 2014

హనుమద్రక్షాయాగం - 6

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
 
హనుమాన్ చాలీసా. తులసీదాసు గారు ప్రపంచానికి అందించిన సంజీవని. రాముని మీద తనకున్న నమ్మకాన్ని భక్తిని  పరిహసించి కేవల వినోదంగా భావించిన పాదుషాలను కోట వదిలి పారిపోయేలా చేసిన మహా మంత్రం. స్వామి మహిమనీ, చరిత్రనీ, భక్తినీ, వినయాన్నీ, శక్తినీ అన్నింటిని నలభై లైన్లలో చెప్పిన మహా మంత్రం. బాపు గారు తీసిన శ్రీరామాంజనేయ యుద్ధం సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. రాముని భక్తుడైన యయాతి రాముని పూజ చేస్తూ ఉండగా పార్వతీదేవి పంపిన మాయ ఆ నగరం మీదకు రాబోతుంది. అప్పుడు ముకులిత హస్తాలతో రామ చంద్ర స్వామి ముందు కూర్చుని ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం లోనుండి ఒక జ్యోతి వెలువడి గోపురం మీదకి చేరుతుంది. ఆ జ్యోతి హనుమగా మారి మాయని గదతో తరిమేస్తుంది. పసిపిల్లలు శ్రీకరమౌ శ్రీరామ నామం  అని పాడుతూ ఉండగా స్వామి ముందు కూర్చుని ఉన్న హనుమయ్య విగ్రహం చూస్తే ఎంతో ముచ్చటగా ఉంటుంది. కోతి నైన జ్ఞానిని చేసే నీ దివ్యనామం అని హనుమ పాడుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో. హనుమ ఉండగా రామభక్తులని కొనగోటితోనైనా అశుభం స్పృశించలేదు.
 
అలా హనుమ రక్షణ, కరుణ పొందిన వారిలో తులసీదాసు ఒకరు. స్వామి దయచేత రాములవారి దర్శనం చేసారు తులసీదాసు. ఆయన మహిమ చేత నిండు పేరోలగంలో రక్షింపబడ్డారు. అప్పుడు తులసీదాసు గారు చేసినదే హనుమాన్ చాలీసా. నేటికీ భక్తుల కొంగు బంగారమై కాపాడుతున్నది. నా అదృష్టం చేత ఐదు సార్లు హనుమద్రక్షాయాగంలో పాల్గొన్నాను. నా చేతులతో స్వామిని అభిషేకించాను. నా చేతులతో స్వామిని తాకుతూ ఆయనకు గజమాల వెయ్యగలిగాను. అభిషేకం సమయంలో సుందరకాండలో స్వామి చెట్లచాటున ఎలా దాక్కున్నారో అలానే మామిడాకుల కింద కనపడ్డారు. అశోకవనంలో వెతికేటప్పుడు పూలతో నిండిన కొండా  అన్నట్టు ఉన్నారు హనుమ అంటే ఓహో అనుకున్నాను. స్వయంగా అలాగే దర్శనమిచ్చారు హనుమ అభిషేకం చేసాక. పచ్చటి పసుపు, ఎర్రటి కుంకుమ, రంగు రంగుల పూలు, తెల్లటి కొబ్బరి చిప్పలు మధ్యలో సింధూర వర్ణంలో స్వామి చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ ఎంత అందంగా ఉన్నారో. ఎంత చెప్పినా తనివితీరదు చూసి తీరవలసిందే.  అలాగే ఆ చాలీసా పుణ్యమా అని తమ కష్టాల నుండి బయటపడ్డ ఎంతో మంది చాలా దగ్గరగా చూసాను. నా స్నేహితులు కొంతమంది నా మీద నమ్మకంతో మొదలుపెట్టి చాలీసా పారాయణ చేసి కొన్ని గడ్డు సమస్యలనుండి బయటపడి స్వామి అనుగ్రహాన్ని స్వయంగా పొందారు. 
 

ఈ సారి మే ఇరవై మూడు హనుమజ్జయంతి. శుక్రవారం రావడం చేత ఇరవైనాలుగు పూర్ణాహుతి జరుగుతోంది. ఈ ఇరవై రోజులూ ఎంత త్వరగా అయిపోతాయా అని ఆత్రంగా చూస్తున్నాను. రాదలచుకున్న వారు దుర్గేశ్వరమాస్టరుగారిని (durgeswara@gmail.com cell 9948235641, durgeswara.blogspot.in ) గానీ, నన్ను కానీ సంప్రదింఛగలరు.
 
మనోహర్ చెనికల