Monday, February 16, 2009

దశ రూపకం-౧౦ వ(పదవ -ఆఖరు) భాగం

౧౦
మందపిల్లి.
౦౭-౧౨-౩౮.
రసరాట్టుగారూ! నాన్నగారు వచ్చారు.మీరు ఏమీ అనుకోకుండా ఉంటే మీకు ఒక సంగతి రాసేసి ఇక్కడితో ఊరుకోమన్నారు.మీపేర నేను పంపిన రచన ఒక పుష్కరం క్రితం మీరే రచించిందట. అది మీరచనలలో కల్లా గొప్పదనే అప్యాయంకొద్దీ నాన్నగారు స్వహస్తంతో లిఖించి, ఆ కాగితం తనదగ్గిర అట్టేపెట్టుగున్నారట,నేను పంపిన రచన అదే అయి ఉంటుందని చెప్పారు. క్షమించండి.

ఇట్లు,
గోపి.

జవాబు
పేరారం,
౦౮ -౧౨ -౩౮
గోపీనాధానికి అనేక ఆశీర్వచనాలు.నేనూ ఊరెళ్ళి ఈ ఉదయమే వచ్చాను.లోగడ నీకు వచ్చిఉన్న జాబులన్నీ, నేను ఊళ్ళో లేకపోబట్టి మా అమ్మాయి రాసింది.జాబుల్లో ఉన్న వృత్తాంతం యావత్తూ,నువ్వు పంపించిన కాగితాల మీద రాసిఉన్నదే. ఆ రచనా, దస్తూరీకూడా మీనాన్నగారివే. అందులో వారు విమర్శనమోనాలురాసి అట్టే పెట్టుగున్నారు, అది పొరపాట్న ఇక్కడికి వచ్చింది. నా రచన అన్నావే! అది కుంభయ్యగారిచేతికి నిరుడు మీ నాన్నే ఇచ్చారు, ఙ్ఞాపకం చేసుగోమను. అయితే నీకు పెండ్లి అయిందా?.......
ఇట్లు,
రసరాట్

No comments: