Monday, May 12, 2014

హనుమజ్జయంతి,హనుమద్రక్షాయాగంలో స్వామి అభిషేకమునకై మీతరపున ఒక అభిషేక కలశం సమర్పించండి


జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!


హనుమత్ రక్షాయాగం పూర్ణాహుతి అనంతరం నూటాఎనిమిది కలశజలములతో స్వామికి అవబృథస్నానం నిర్వహించబడుతుంది.

అందుకోసం నూటా ఎనిమిది కలశములను నూటాఎనిమిదిమంది భక్తుల తరపున సుగంధద్రవ్యములతో గంగాజలంతో నింపి గంగాది దివ్యనదులను ఆవాహనచేసి పూజించి ఋత్విక్కులు సిధ్ధపరచి ఉంచుతారు. పూర్ణాహుతి అనంతరం జాగంలో పాల్గొన్నవారు, ఎవరైతే యాగమునకు ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా తమతరపున స్వామి అభిషేకమునకు కలశములఏర్పాటుచేయమని కోరుతారో వారి తరపున పురోహితులు అభిషేకం నిర్వహిస్తారు.

ఒక్కొక్క కుటుంబతరపున ఒక్కొక్క కల్శము ఏర్పాటు చేయటం జరుగుతుంది. అందులో ప్రస్తుతం అన్నపూర్ణభిక్షాశాల నిర్మాణంలోనూ,ఈసంవత్స్రరం జరుగుతున్న హనుమత్ రక్షాయాగంలోనూ తమ పురుషార్ధములను సమర్పించినవారితరపున కలశస్థాపన జరుపగా మిగిలిన సంఖ్యలో కలశస్థాపనకు భక్తులకు అవకాశం కల్పించబడుతుంది. ఇందుకోసం ఒక్కో కలశస్థాపనకు 1116/- .పురుషార్థంగా సమర్పిమ్చవలసి ఉంటుంది. వారి తరపున హనుమజ్జయంతి రోజు అర్చన,పూర్ణాహుతి సమయంలో అభిషేకం నిర్వహించి స్వామి వారి రక్షలు ప్రసాదం పంపబడుతుంది. ఇతరదేశాలకు పంపుటకుమాత్రం కొరియర్ చార్జీలు వారేభరించవలసిఉంది.
ఇది కేవలం స్వామిసేవలో పాల్గొనే అవకాశం అందరికీ కల్పించి ఈ ద్రవ్యమున ఈయాగంలో అర్చనలకు,అన్నదానమునకు ఉపయోగించబడతాయి. ఇందులో భక్తిని వ్యాపారంగా మార్చే ఎటువంటి కలిప్రభావపు ఆలోచనలు లేవని తెలియపరుచుకుంటున్నాము.

తమతరపున కూడా కలశస్థాపన అర్చన జరిపించుకోదలచుకున్న వారు మెయిల్,లేదా ఫోన్ ద్వారా సంప్రదిస్తే వారికి ఎక్కౌంట్ నంబర్ తెలియపరుస్తాము.
జైశ్రీరాం


భక్తజనపాదదాసుడు
దుర్గేశ్వర
durgeswara@gmail.com
9948235641



Manohar Chenekala

No comments: