Monday, May 5, 2014

హనుమత్ రక్షా యాగమునకు మీ గోత్రనామాలు పంపండి

http://durgeswara.blogspot.in/2014/05/blog-post.html

ఓం గం గణపతయే నమః

శ్రీ సీతాసమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః

ఓం హం హనుమతే నమః

ఆస్తికలోకమునకు శిరసా వందనము.

భగవద్బంధువులారా ! శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం గత ఆరుసంవత్సరములుగా హనుమత్ రక్షాయాగం అను పేరున భక్తజనావళికి ఆంజనేయస్వామి రక్షకలగాలని కోరుతూ యాగము నిర్వహించటం జరుగుతున్నది. ఇప్పటికి ఐదు ఆవృతులు పూర్తి చేసుకుని ఆరవ ఆవృతి గా భక్తజన సంరక్షణార్థం ఇరవైనాలుగు కోట్ల రామనామ లేఖన సహితంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీ శనివారం [,వైశాఖ బహుళదశమి ,శనివారం] యాగం పూర్ణాహుతి జరుపబడుతున్నది. ఇప్పటివరకూ జరిపిన ఐదు ఆవృతులలో నిష్ఠగా నియమానుసారంగా స్వామిని ఉపాసించినవారికి అనేక శుభములు ప్రాప్తించాయి. జీవితంలో సమస్యలు ,ఆర్ధిక ఇబ్బందులు ,సాంసారిక ఇక్కట్లు తొలగి సంతాన, .ఉద్యోగ, ఆరోగ్య, ఆథ్యాత్మిక లాభాలు ప్రాప్తింప జేసుకున్నవారు అనేకమంది స్వామి కృపకు ఉదాహరణలుగా కనపడుతున్నారు.


ముందుగా భక్తులు తమ గోత్రనామాలను మెయిల్ ద్వారా తెలియపరచాలి. గోత్రనామాలు పంపినవారందరి తరపున సంకల్పాదులు చెప్పి వారి తరపున కూడా ఆహుతులివ్వబడతాయి. ఇందుకోసం ఎవరూ ఏమీ చెల్లించవలసిన పనిలేదు.

ఈ యాగంలో పాల్గొనదలచుకున్నవారు [ప్రత్యక్షంగా లేక పరోక్షంగా] యాగం పూర్ణాహుతి దాకా సాధ్యమైనంత సంఖ్యలో హనుమాన్ చాలీసా పారాయణం, శ్రీరామనామ జపము చేయాలి. యాగంలో స్వయంగా పాల్గొనదలచినవారు పదకొండు రోజులపాటు, బ్రహ్మచర్య పాలన, మాంసాహారం,మద్యం,గుడ్డు భుజించటం పొగత్రాగటం లాంటివాటికి దూరంగా ఉండాలి. వారు ఇరవై మూడు[హనుమజ్జయంతి రోజు సాయంత్రమునకల్లా పీఠానికి చేరుకోవాలి. వారికి భోజనవసతి సౌకర్యములు [మాఅందరితోపాటు] కల్పించబడతాయి. స్వయముగా యాగమునకు రాలేనివారు ఇంటివద్దనే ఈ నియమాలు పాటించవచ్చు. వారు తమ జపసంఖ్యను ఎస్. ఎమ్. ఎస్. ద్వారా తెలుపవలసి ఉంటుంది .
ఇప్పటికే రామనామ లేఖనం ప్రారంభించి పూర్తిచేస్తున్నవారు మే ఇరవై కల్లా పీఠమునకు చేరేలా కొరియర్ లేక పోస్ట్ ద్వారా పంపించగలరు.

ఎవరైనా యాగంలోను, అన్నప్రసాద వితరణలోనూ తమ వంతు పురుషార్థములు సమర్పించాలనుకుంటే ఇక్కడ మెయిల్ ద్వారాగాని లేక దిగువన ఇస్తున్న నంబర్ లోగాని సంప్రదిస్తే వారికి బాంక్ ఎక్కౌంట్ నంబర్ తెలుపబడుతుంది. దానికి సంకల్పించిన సహాయం అందజేయవచ్చును పూలు,ఆకులు,పండ్లు ప్రసాదములు,యాగద్రవ్యములు, ఇలా ఏఏ ద్రవ్యాలకగు ఖర్చును భరించాలనుకున్నా వారి తరపున ఆయాద్రవ్యాలు తెప్పించి యాగంలో ఉపయోగించటం జరుగుతుంది..[ఇది కేవలం వారి ఇచ్చానుసారం అందించవలసిన సేవ. ] ఇలాపాల్గొనేవారందరికీ వారి ఖర్చులతో యజ్ఞ ప్రసాదములు పోస్ట్ లో పంపబడతాయి.
ఇప్పడు జరుగుతున్న అన్నపూర్ణ భిక్షాశాల నిర్మాణం లో ఇప్పటికే తమ సహాయాన్ని అందించినవారు ఏమీ పంపవలసిన పనిలేదు.


గోత్రనామాలు పంపవలసిన చిరునామా

durgeswara@gmail.com


9948235641

శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం
రవ్వవరం [పో]
నూజండ్ల మండలం
గుంటూరు జిల్లా
పిన్ 522660

rute హైదరాబాద్ టు ఒంగోలు వయా వినుకొండ _ ఉల్లగల్లు బస్ తెల్లవారు జామున నాలుగు గంటలకల్లా పీఠం దగ్గర దింపుతుంది [టిక్కెట్ మాత్రం ఉల్లగల్లువరకు తీసుకోవాలి]
స్వంతవాహనాలలో వచ్చేవారు హైదరాబాద్_ నాగార్జునసాగర్_ మాచర్ల- కారంపూడి- వినుకొండ- రవ్వవరం
మొత్తం ఆరుగంటల ప్రయాణం [ వినుకొండ దాకా బస్సులలో వచ్చి అక్కడనుండి పీఠానుకి వేరే బస్సులో చేరవచ్చు]

ఇక విశాఖ,విజయవాడ వైపునుండి వచ్చేవారు ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో నేరుగా వినుకొండలో దిగవచ్చు
విజయవాడనుండి గుంటూరు మీదుగా హైవే లో వినుకొండ చేరవచ్చు.

రాయలసీమ వైపునుండి వచ్చేవారు కర్నూల్- విజయవాడ హైవే పైన వినుకొండ లోనే దిగవచ్చు.
బెంగళూర్ నుండి ,వచ్చే ప్రశాంతి, యస్వంతపూర్ ట్రైన్ లు వినుకొండలో ఆగుతాయి .
నెల్లూరు ఒంగోలు వైపునుండి వచ్చేవారు ఒంగోలునుండి అద్దంకి చేరుకుని అక్కడ నుండి దరిశి రూట్ లో ఉల్లగల్లు స్టేజ్ లో దిగి రవ్వవరం చేరుకోవచ్చు.

ప్రయాణంలో ఏ అనుమానం వచ్చినా ఫోన్ లలో సంప్రదించండిః యాగంలో పాల్గొనేవారంతా కలసి ఉంటాము, కలసి భుజిస్తాము , కనుక విలువైన ఆభరణములను ,వస్తువులను తెచ్చుకోవద్దని మనవి.
ఇక ఆహారవిషయంలో ఎవరి నిష్ఠకూ భగం కలుగని రీతిలో ఏర్పాటు చూస్తాము కనుక ముందుగా తెలిపితే వారి ఆచారానికనుగుణంగా భోజన ఏర్పాట్లు చేయటం జరుగుతుంది.
contact no.
9948235641
9180204554
9010402119
 
భక్తజనుల సేవలో
దాసుడు
దుర్గేశ్వర


జైశ్రీరాం