Friday, April 17, 2009

ఎవరు వేసారు వోటు ?

ఒక విడత ఓటింగ్ అయిపోయింది. కానీ ఎంతమంది ఓటేసారు?సెలవు లేదో లేదో అని గోలెట్టేసారు. ఇచ్చారు. కానీ ఏం లాభం. చదువుకోని వాళ్ళు చాలావరకు ఓటేసారు. పడని 35% ఓట్లలో 99% చదువుకున్న వాళ్ళవే అని నా నమ్మకం. చదువుకుంటే కాకరకాయ కీకరకాయ అయినట్టు ఉంది.

మొత్తం జనాభాలో 60% కి ఓటుహక్కు ఉందనుకుంటే , అందులో 60% జనాభా ఓటుహక్కును వినియోగించుకుంటే ఎంతమంది ఓటేసినట్టు? (36%) అంటే వందకి 36 మంది మీద ఆధారపడిన ఈ దేశ భవిష్యత్తు ని విమర్శించడానికి మాత్రం అందరూ ముందే. ఎందుకీ దుస్ధితి. దీనికి కారణం ఎవరు? నిరక్షరాస్యులా, నిస్సందేహంగా కాదు. అక్షరాస్యులమని, ఆధునికులమని చెప్పుకునే వాళ్ళే.

2 comments:

చైతన్య said...

నిజం... మొత్తంమీద 65% మాత్రమె ఒటేసారంట...
అధిక శాతం(75%) మంది మెదక్ జిల్లాలో వేస్తే... అతి తక్కువ శాతం(54%) వేసింది మాత్రం హైదరాబాద్లోనే !!

చైతన్య.ఎస్ said...

నేను వచ్చే గురువారం వేస్తానోచ్