Thursday, January 22, 2009

దశ రూపకం -నాల్గవ బాగం

మందపిల్లి.
25-11-38.
ఆర్యా! మా నాన్న గారు గ్రామాంతరం వెళ్ళేటప్పుడు ఈ రచన మీద అభిప్రాయంకోసం ఇది మీ పేర పంపించమని నాతో చెప్పారు. అన్నట్టు, మీరు వారికి బాకీ ఉన్న లెఖ్ఖ గురించి వ్రాయమనికూడా అని వెళ్ళారు.

ఇట్లు,
గోపి.
జవాబు
పేరారం,
౨౬-౧౧-౩౮
గోపీ! అల్లా చెప్పుమరీ! అందుకనే ఈ రచన మిక్కిలి ఉత్కృష్టం. కవి కేవల ఛాందసుడు కాడు. ఒకటోరకమైన చాదస్తంలా పైకి కనిపించేది యావత్తూ ఫక్తు చేవ,గుంజు. ఇందులో అపార పాండిత్యం గంగాతరంగాలవంటి నిమ్నోన్నత భావాలలో చదువర్ని ముంచి లేవనెత్తుతుంది. పాండిత్యం ఇంత సద్వినియోగం చేసినవాళ్ళు లేరు.ప్రాచీన సంప్రదాయం ఇక్కడే నిల్చింది. మారుమూల పదాలకి ఈ రచన కాణాచి, అపురూప కారకాలకి ఈ రచన దిక్కు, పురాణేతిహాసాలకి ఈ రచన ధర్మ సత్రం. నేలబారు రోకలిబండ్లు ఎగర్లేని మహోన్నత కవితాగిరిశిఖరాలలోనే ఈ కవివాణి విహరిస్తుంది. గ్రహించే బుర్రలుండాలిగానీ, నవీన విజ్ఞానం అనబడేది కూడా చణక శాస్త్రిగారి ఈ క్రొత్త రచనలో ఉంది. నాదీ పూచీ!
ఇట్లు,
రసరాట్

No comments: