Tuesday, August 2, 2016

జర్మనీ రాముడు

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!


నాన్నా? మరి జర్మనీ వాళ్ళకి దేవుడు ఎవరు? ఉన్నట్టుండి అడిగింది మా అమ్మాయి. దేవుడు, చేపలాగా, తాబేలులాగా, పందిలాగా ఎందుకు వస్తాడు నాన్నా? అన్న ప్రశ్నకి కొనసాగింపు మొదటి ప్రశ్న
మనము రాముడికి, సీతమ్మకి, కృష్ణుడికి, ఆంజనేయస్వామికి దణ్ణం పెట్టుకున్నట్టే వాళ్ళు యేసు క్రీస్తుకి పూజ చేస్తారమ్మా అని చెప్పాను.
ఎందుకని, వాళ్ళకి రాముడు తెలియదా?
- తెలియదమ్మా, వాళ్ళు యేసుని దేవుడిలాగా పూజ చేస్తారు.

మరి సీతమ్మ?
-తెలియదమ్మా

మరి ఆంజనెయస్వామి?
ఆయన కూడా తెలియదమ్మా!

మరి రామంసుడు?
- ఎవరూ?

రామంసుడు నాన్నా!
- రాక్షసులేమోనండీ!
-రాక్షసులా?

కాదు నాన్నా! సీతమ్మని ఎత్తుకుపోయి,
-రావణాసురుడా?

ఆ అవును.
-ఆయన కూడా తెలియదమ్మా!

ఎందుకని?
- ఎందుకంటే, ఇప్పుడు, విజయవాడలో, బెంగళూరులో దొరికేవి ఇక్కడవాళ్ళకి తెలియవుకదా, జిలేబి, జాంగ్రి ఇలాంటివి! (తటాలున ఏం చెప్పాలో తెలియక, జిలెబి చెప్పానన్నమాట).  

ఇక్కడ దొరకవుగానీ, పారిస్ లో దొరుకుతాయి.
-?????

మనం పారిస్ వెళ్ళినప్పుదు జిలేబి కొనుక్కున్నాం కదా,
-అవును జిలేబి తినడానికేగా పారిస్ వెళ్ళింది, అలాగ, ఇక్కడ దొరికేవి ఇక్కడి వాళ్ళకి తెలుస్తాయి. చైనా వాళ్ళు బుద్ధుడికి పూజ చేస్తారు, ముస్లిములు అల్లాకి పూజ చేస్తారు, మనం రాముడు, సీతమ్మ, ఇలా పూజలు చేస్తాం, అలాగే వీళ్ళు యేసు క్రీస్తుకి పూజ చేస్తారు.

సరే గానీ అసలు దేవుడు ఎందుకు చేపలాగా , తాబేలు లాగా, పందిలాగా రావాలి?
-మనుషులు నీళ్ళలో ఎంతసేపు ఉండగలరు?

కొంచేపే
-మరి చేపలు?

అవి ఉండేది నీళ్ళలోనే కదా!
-అందుకే నీళ్ళొచ్చి భూమి అంతా మునిగిపోయేటప్పుడు, చేపలాగా వచ్చి కాపాడాడు.
-తాబేలు కి డిప్ప గట్టిగా ఉంటుంది కదా, అందుకే తాబేలులాగా వచ్చి కొండని మోసాడు.
-పంది నేలని తవ్వుకుంటూ కిందకి వెళ్ళగలదు కదా, అందుకే అలా వచ్చి భూమిని కోరలమీద పైకి లేపాడు.
-మనం ఎవరికైనా సాయం చెయ్యగలిగే పరిస్థితిలో ఉంటే తప్పకుండా సాయం చెయ్యాలి.
-మనకి ఎవరైనా సాయం చేస్తే వాళ్ళు దేవుడితో సమానమే

రేపు ఏ కధ చెప్తావో ఇప్పుడే చెప్పి పడుకో, రేపు గుర్తు చేస్తా!
- రేపు స్వామి సింహం లాగా వచ్చిన కధ చెప్తా పడుకో.

సింహం అంటే నాకు భయం.
- ఏం కాదులే

సరే
గుడ్నైట్,
-గుడ్నైట్
జై శ్రీరాం,
-జై శ్రీరాం.

No comments: