జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
Can any body help me in getting printed versions of these books. I will be so grateful to them.
చివరిసారిగా శివరాత్రికి ఏమో ఒక టపా రాసాను. మధ్యలో హనుమజ్జయంతి కి రాసాను. అంతే మళ్ళీ ఎందుకో రాయలేకపోయాను. కానీ ఈ రోజు రాయాలనిపించింది.
నేను తెలుగు రామాయణాలు, వ్యాఖ్యానాలు, పరిశొధనా పత్రాలు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నానని నా మిత్రులు చాలామందికి తెలుసు. ఈ రోజుకి ఆ భండాగారంలో మరో కలికితురాయి చేరింది. అదే శ్రీమద్రామాయణ కల్ప వృక్షం.
మొన్న మొన్న వరకు కల్పవృక్షం అంటే కల్పవృక్షం అనుకున్నాను. ఒక గొప్పాయన తో కలిసి బాలకాండ కొంత పారాయణ చెయ్యడం జరిగింది. అప్పుడే కొనాలన్న కోరిక పెరిగింది. అది ఈ రోజుకి తీరింది.
దీనితో నా దగ్గర
శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి రామాయణ తత్వదీపిక
చాగంటి వారి రామాయణ ప్రవచనాలు
ఆధ్యాత్మ రామాయణం
శ్రీమద్రామాయణ కల్పవృక్షం
ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు గారి మందరము (3 భాగాలు) - pdf
శబరి (కల్పవృక్ష శబరి మీద వ్యాసాలు) - pdf
సీతారామాంజనేయ సంవాదం ( పరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తి గారు) - pdf
ఆశ్చర్య రామాయణం సుందరకాండ (లక్కావఝ్ఝుల వేంకట కృష్ణ శాస్త్రి గారు) -pdf
శ్రీరామావతార తత్వము (చిలుకూరు వేంకటేశ్వర్లు గారు)
షోడశి రామాయణ రహస్యాలు (గుంటూరు శేషేంద్ర శర్మ గారు)
త్రిదండి స్వామి వారి సంస్కృత వ్యాఖ్య -pdf
రంగనాధ రామాయణం -pdf
వచన రామాయణం -2 (శ్రీ శ్రీనివాస శిరోమణి గారు) -pdf
జానకీ శపధం (హరికథ- శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయాణదాసు గారు) -pdf
వాల్మీకి రామాయణ విమర్శనము (కొడాలి లక్ష్మీ నారాయణ) -pdf
కల్ప తరువు (ఆంధ్ర బెర్నార్డ్ షా- వేదాంత కవి) - pdf
రామాయణ రహస్యాల సమీక్ష (వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు) -pdf
వాల్మీకి రామయణం సంబంధాలు (డా. డి నరసింహా రెడ్డి) -pdf
శ్రీమద్వాల్మీకి రామయణోపన్యాసాలు (2,3,4) (నండూరు సుబ్రమణ్య శర్మ) -pdf
ఇంకా సంపాదించాల్సినవి
భాస్కర రామాయణము (ఆన్ లైన్ లో దొరుకుతుంది, కానీ తాత్పర్యం వుందో లేదో అని ఆగిపోయాను)
మొల్ల రామాయణం
గణపతి రామాయణ సుధ
చంపూ రామాయణం
పుల్లెల రామచంద్రుల వారి వ్యాఖ్య
పేరు తెలియదు కానీ వాల్మీకి మీద, ఆయన కవిత్వంలోని విచిత్రాల మీద, పన్నెండు సంవత్సరాల క్రితం అనంతపురం గ్రంధాలయంలో ఒక పరిశోధన గ్రంధం చదివాను. అది ఎప్పటికైనా సంపాదించాలి
విశ్వనాధ వారి నా రాముడు
ఆనంద రామాయణం
ఆశ్చర్య రామాయణం
ఎప్పటికి సంపాదిస్తానో..... చూద్దాం
Tuesday, July 7, 2015
Wednesday, May 13, 2015
హనుమజ్జయంతి 2015
జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
2009 లో అనుకుంటా మొదటిసారి వినుకొండకి హనుమద్రక్షాయాగానికి వెళ్ళడం జరిగింది. అప్పటినుండి ప్రతి సంవత్సరం వెళ్తునే ఉన్నాను. అదొక అలౌకిక అనుభూతి. ఆ స్వామికి నా చేతులతో అభిషేకం చేసి అలంకరించే భాగ్యం కోటి జన్మలకైనా దొరకదు. రెండురోజులు మామూలు విషయాలకు దూరంగా హనుమద్వైభవాన్ని చూస్తూ గడిపే అదృష్టం స్వామి గత ఆరు సంవత్సరాలుగా ప్రసాదించారు. వెళ్తూనే తలస్నానాలు చేసి అమ్మవారికి, స్వామి వార్లకీ, పూజ చేసి మహా నైవేద్యం చెయ్యడం, తర్వాత అల్పాహారం. ఆ తర్వాత ఈ సంవత్సరం స్వామి ఎలా చేపిస్తారో అని అనుకుంటూ గడపడం. సాయంత్రం, రక్షలు తయారు చెయ్యడం, యాగకుండాలు తయారు చెయ్యడం, అప్పటివరకూ గోత్రనామాలు పంపిన వారి పేర్లు నోట్ చేస్కోవడం ఇలా మొదటిరోజు అయిపోయేది. తర్వాత రోజు ఇక సందడి, పొద్దున్నే కరెంట్ పోయే లోపు 108 కలశాలు తయారు చెయ్యాలి. ఒకసారి మా నాగప్రసాద్ అనుకుంటా, మోటర్ వేస్తారు కదా ఆ నీళ్ళు వాడి శుభ్రం చేద్దాం అని మీన మేషాలు లెక్కెట్టించాడు, చివరికి పనీ పూర్తవ్వలేదు, కరెంటూ పోయింది. ఇక అప్పటికప్పుడు బోరింగ్ దగ్గరికి పోయి నీళ్ళు పట్టుకువచ్చి కలశాలు తయారుచేసాం. ఎవరో ఒకతల్లి కూడా సహాయం చేసింది. పూజాద్రవ్యాలకి ఎడమచెయ్యి తగలకూడదని ముందే మాష్టరు గారు హెచ్చరించేవారు. తర్వాత స్వామికి అభిషేకాలు. ఇక అభిషేకాలప్పుడు చూడాలి. అంతెత్తు నిలబడ్డ స్వామికి స్నానం చేపించడమంటే మాటలా! పూజ్యగురువులు చాగంటివారు అంటారు విశ్వవ్యాపకుడైన స్వామికి మనం ఏం కైంకర్యం చెయ్యగలము అని. అది కళ్ళెదుట కనిపిస్తున్నట్టు ఉండేది. "యధా రాఘవ నిర్ముక్త శరశ్స్వసన విక్రమః, గచ్చేత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం" అని చెప్పి నిలబడ్డ స్వామి గుర్తొస్తారు ప్రతిసారి అభిషేకాలప్పుడు. ఇలా అభిషేకాలు జరుగుతున్నంతసేపూ విశాఖపట్నం నుంచి వచ్చిన బాబూరావుగారు ఏదో ఒక కీర్తన పాడుతునే ఉండేవారు. అసలే పొగిడితే పెరిగే స్వామి! అందులోనూ పాడుతున్నది MS Ramarao గారి దగ్గర సుందరకాండ నేర్చుకున్న వ్యక్తి. మామూలుగా ఉన్నప్పుడు ఆయన వయసు తెలిసేది కానీ, కీర్తన మొదలుపెట్టారంటే అలా వింటూ ఉండిపోవలనిపిస్తుంది. అలసటా, ఆయాసం ఏమీ అడ్డు వచ్చేవి కాదు. స్వామి హనుమ స్వయంగా సామగాన ధురంధరుడు, అలాంటిది ఆయనకి భక్తుడు పాడితే ఇలానే ఉంటుంది అనిపిస్తుంది. ఈ అభిషేకాలు ఇలా జరుగుతూ ఉంటే ఎంత బాగుండో కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ స్వామి కి జలుబు చేస్తుందని ఆపేసేవాళ్ళం.
ఇక ఆ తర్వాత పొడ లేకుండా తుడిచి సింధూరం లేపనం చేస్తుంటే చూడాలి.
పంచశీర్షామివోరగా అని కీర్తించబడ్డ చేతులు,
ఉరయాపాస జీమూతమివమారుతః అని కీర్తించబడ్డ వక్షస్థలం
బాహుభ్యాం స్థంభయామాస అని కీర్తించబడ్డ భుజాలు,
పరిఘసన్నిభౌ అని కీర్తించబడ్డ తొడలు,
పరమపావనమైన ఆయన పాదాలు.... ఇలా శుభ్రంగా తుడిచి పూలతో అలంకరించేవాళ్ళం.
తరువాత, అంత స్వామి కి అంత గజమాల ధరింప జేసేవాళ్ళం.
ఈ లోపు కళ్యాణానికి శివపార్వతుల మూర్తులని శుభ్రం చేసేవాళ్ళం. పొయిన సారి అనుకుంటా నేను చాలా సీరియస్ గా పని చేసుకుంటుంటే మైథిలి వచ్చింది. ఏం చేస్తున్నావు నాన్నా అనింది. స్వామికి స్నానం చేపిస్తున్నా అని చెప్పా. సబ్బు ఎక్కువ పుయ్యకు కళ్ళు మండుతాయి అని చెప్పి చూస్తూ కూర్చుండిపోయింది. భలే అబ్బురమనిపించింది. అందుకు కదా బెజ్జమహాదేవి కోసం ఆ పరమశివుడు పసిపిల్లాడైపోయాడు అనిపించింది.
ఇక తరువాత యాగం. అన్నదానం చిదంబరశాస్త్రిగారి లాంటి హనుమదుపాసకుల ఆధ్వర్యంలో జరిగినప్పుడా యాగకీలల ఆనంద తాండవం చూడాలి. ఐదవసారి అనుకుంటా ముప్ఫైయేళ్ళు మేము ఈ కాడి మోసాము, ఇక మీ తరం ఎత్తుకోవాలి నాయనా అన్నారు. చాలా బాధనిపించింది. ఈ మధ్య నేను ఏ కార్యక్రమాలకి వెళ్ళడంలేదు, కానీ ఇక్కడికి మాత్రం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇంతమంది యువత స్వామి కోసం చేస్తున్న పని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అన్నారు. వారు లేకుంటే ఆంధ్రలోకానికి పరాశరసంహిత ఇంత దగ్గర అయ్యుండేది కాదన్నది నిర్వివాదాంశం. వారు ఆనందించారంటే సాక్షాత్తు స్వామి ఆనందించినట్టే.
ఆరేళ్ళుగా జరుగుతున్న యాగమే అయినా ప్రతీసారి ఒక్కొక్కరకంగా జరిగింది.
ఒకసారి ద్వాదశకుండాలతో
ఒకసారి ఒకే కుండంలో
ఒకసారి 27 యజ్ఞ కుండాలలో 108 జంటలతో
ఒకసారి 27 యజ్ఞకుండాలలో 54 జంటలతో
ఇలా ఆయన ఇష్టం, ఎవరో ఒకరి నోట పలికిస్తాడు జరుగుతుంది.
యాగం జరుగుతున్నంతసేపూ చాలీసా పారాయణం జరుగుతూనే ఉండేది.
చివరగా బయలుదేరేముందు ఒక్కసారి ఆ స్వామి దగ్గరికి పోయి కూర్చునేవాడిని. నిన్నటి రోజున మన పక్కన తిరిగిన మనిషి ఈ రోజు హటాత్తుగా పెద్ద స్థితిమంతుడైపోతే ఎలా ఉంటుందో అలా అనిపించేది. నిన్న నిదానం గా స్నానం చేపించి, నిదానంగా సింధూరం పూసి, తక్కువపూలతో అలంకరణ చేసినా మా చేతుల్తో చేసాం అని తృప్తిగా ఉండేది. అదే ఇప్పుడు చూస్తే చుట్టూ రంగు రంగుల పూలతో, పసుపు కుంకుమలతో, తమలపాకులతో, కొబ్బరికాయలతో మామిడాకులతో మా స్వామేనా అని సందేహం వచ్చేది. అప్పుడు చూడాలి నా స్వామిని శుచిస్మిత అయిన సీతమ్మలా, సర్వసత్త్వమనోహరుడైన రాముడిలా, సత్వస్వరూపమైన శివుడిలా, మంగళరూపమైన గౌరీదేవిలా, సృష్తికర్త యైన బ్రహ్మలా, జ్ఞాననిధి యైన సరస్వతిలా సర్వదేవతా స్వరూపంగా కనపడి ప్రశాంతంగా బయలుదేరేవాడిని.
ఇక ఈసారి, ఏడవసారి మరింత బ్రహ్మాండంగా ఏడు రోజుల కార్యక్రమంగా రూపుదిద్దుకుని శనిత్రయోదశి నాడు పూర్ణాహుతి నిర్ణయించబడింది. సముద్రం దగ్గరికి చెంబు పట్టుకెడితే చెంబుడు నీళ్ళే వస్తాయి, బిందె పట్టుకెలితే బిందెడు నీళ్ళు వస్తాయి అని పూజ్యులు చాగంటి వారు చెప్పేవారు. ఆన్సైట్ కావాలో అని ఆయన్ని వేధించి, సుందరకాండ చూపించి బ్లాక్మెయిల్ చేసి చివరికి దేశం కాని దేశం లో కూర్చుని ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అనిపిస్తుంది. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలేమో, ఏది వదులుకోవాలో తెలియక కావాల్సినదాన్ని వదులుకుని ఒక మిధ్యాప్రపంచంలో బతుకుతున్నామని తెలుసుకోడానికి నేను పెట్టిన పణం ఈ సారి జరుగుతున్న హనుమద్రక్షాయాగం. అక్కడ ఉంటే ఈపాటికి కలశాలు రెడీ చేసి ఉండేవాళ్ళం, ఈ పాటికి అభిషేకం అయిపోయేది, ఈ పాటికి భోజనాలు చేసేవాళ్ళు అందరూ, ఈ పాటికి కళ్యాణం అయిపోయేది, అని అనుకుంటూ ఉండాల్సొస్తుంది. కనీసం వచ్చే సారైనా హనుమజ్జయంతికి ఆ స్వామి పాదాల దగ్గర ఉండాలని కోరిక.
If anybody want to go on this Saturday(16th May2015) Pleasse contact durgeswara - 9948235641
Tuesday, February 17, 2015
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
శివుడెక్కడున్నాడంటూ తిరిగాను,
నీలో చూసుకున్నావా అని ఆ శివుడు అడిగేవరకూ
శివుడెవరని ఎందరెందరినో అడిగాను
నిన్ను నువ్వడగవేమని ఆ శివుడు అడిగేవరకూ
శివమంటే ఏమిటని ఎవరెవరినో అడిగాను,
నువ్వెవరని లోనుండి ఆ శివుడు అడిగేవరకూ
శివుడెలా ఉంటాడని అందరినీ అడిగాను,
ఎలా ఉండాలనుకుంటున్నావో చెప్పు అని ఆ శివుడు అడిగేవరకూ
శివుడెందుకని అందరినీ అడిగాను,
ఆలోచించు నువ్వుండగా నేనెందుకని ఆ శివుడు అడిగేవరకూ
మహా శివరాత్రి: చిన్నప్పుడు మహా శివరాత్రి అంటే జాగారం, అప్పుడు దూరదర్శన్ వాడు వేసే భక్తి సినిమాలు, ఎవడు ఎక్కువసేపు మేల్కొంటాడో అని పందాలు, పొద్దున్న లేచాక సన్నాయి నొక్కులు.
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది,
అదిగో అనంతమైన జ్ఞానలింగం ఆద్యంతాలు లేకుండా పెరిగిపోతుంది.
సాయంత్రం దాకా వెలుగునిచ్చిన సూర్యుడు, కోటి సూర్యుల పగిది వెలిగే ఆ మహా సూర్యుని ముందు దివిటీ అయినాడు.
సృష్టి చేసే బ్రహ్మ మరో సృష్టికోసం వలసిన తేజస్సును తీసుకుపోవడానికి వచ్చాడా అన్నట్టు భక్తి ప్రపత్తులతో నిలబడి ఉన్నాడు
ఈ మహా శక్తేనా బాణుడితో యుద్ధమొనరించినప్పుడు, లీలగా నేనోడినానని పలికినవాడు, ఈ మహా శక్తేనా తన భక్తుడైన రావణుడిని పరాభవించి సీత జాడ తెలిపినదని అబ్బురపడి చూచుచుండె విష్ణుమూర్తి
ఈ తేజస్సే కదా సమస్త విద్యలకూ ఆలవాలమైన డమరుకాన్ని ధరించేదని సరస్వతీదేవి ఆశ్చర్యముగా చూస్తూ నిలబడి పోయింది.
ఈ తేజస్సే కదా పుత్రసముడివలే నన్నూ నా స్వామిని కలిపినదని సాగర గర్భసంభూత, సలక్షణ జాత, దేవదేవ దివ్యమహిషి అప్యాయతతో అలా చూస్తూ ఉండిపోయింది.
ఇంతటి స్వామిలో, తేజస్సులో, సగభాగాన్ని కదా అని ఆ తల్లి సర్వ మంగళ మాంగళ్య, సర్వార్ధ సాధకి, గౌరి అలా రెప్పవాల్చకుండా నిలుచుందిపోయింది.
మాకోసం కదా ఇంతటి స్వామి విషాన్ని మింగి గరళ కంఠుడయ్యాడని సకల దేవగణమూ, అలా నిలిచిపోయింది
నిను సేవింపగ నాపదల్పొడమీ, నిత్యోత్సవంబబ్బనీ, జనమాత్రుండననీ, మోహంబు పైకొననీ అంటూ శివసాయుజ్యాన్ని పొందిన భక్త కోటి అంతా పరవశిస్తూ గానం చేస్తున్నారు.
అది ప్రకృతి పరమశివుడి ఆద్యంత రహితమైన అద్భుతమైన రూపాన్ని కన్నులారా చూస్తూ, చెవులారా వింటూ తానై శివుడై, శివుడే తానౌతున్న క్షణం.
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
సూర్యుడివలె నిన్ను నువ్వు వెలిగించుకోవాలని, నలుగురికీ వెలుగునివ్వాలనీ లేదా అంటూ,
బ్రహ్మ వలె నువ్వు ఏం సృష్టించాలో చెప్పు అంటూ,
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
నీ కోసం నేను హనుమంతుడినవ్వడానికి సిద్ధం , నువ్వు రాముడవ్వడానికి సిద్ధమేనా అంటూ,
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
ఈ ఢమరు శబ్దమే నీలోంచి వస్తోంది విన్నావా, వినగలవా, వినడానికి సిద్ధమా అంటూ,
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
నిన్నూ నీలో ఉన్న నన్నూ కలిపేది నేనే, కలపగలిగేది నేనే, నువ్వు సిద్ధమా అంటూ,
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
నిన్ను నాలో సగం చేసుకోవడానికి నేను సిద్ధమే కానీ నీ మనసులో సగం కాదుకదా ఏ కొంచెమైనా ఖాళీ ఉందా ఉంటూ,
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
సకలదేవగణాల రక్షణకోసం విషం మింగినవాడిని నీకోసం ఏమీ చెయ్యలేనా, కానీ నోరు తెరిచి అడగవెందుకని అంటూ,
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
శివసాయుజ్య సాధనా చతుర అశేష మునిగణమూ, అసామాన్య భక్తిగణమూ నీకు నా సులభత్వాన్ని బోధపరచడంలేదా అంటూ
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
ప్రకృతి లో నువ్వు దేన్ని చూసినా నన్ను చూసినట్టే, చూస్తున్నట్టే, కానీ ఎందుకు ఒప్పుకోవడానికి సంకోచిస్తున్నావ్ అంటూ
నీలో చూసుకున్నావా అని ఆ శివుడు అడిగేవరకూ
శివుడెవరని ఎందరెందరినో అడిగాను
నిన్ను నువ్వడగవేమని ఆ శివుడు అడిగేవరకూ
శివమంటే ఏమిటని ఎవరెవరినో అడిగాను,
నువ్వెవరని లోనుండి ఆ శివుడు అడిగేవరకూ
శివుడెలా ఉంటాడని అందరినీ అడిగాను,
ఎలా ఉండాలనుకుంటున్నావో చెప్పు అని ఆ శివుడు అడిగేవరకూ
శివుడెందుకని అందరినీ అడిగాను,
ఆలోచించు నువ్వుండగా నేనెందుకని ఆ శివుడు అడిగేవరకూ
మహా శివరాత్రి: చిన్నప్పుడు మహా శివరాత్రి అంటే జాగారం, అప్పుడు దూరదర్శన్ వాడు వేసే భక్తి సినిమాలు, ఎవడు ఎక్కువసేపు మేల్కొంటాడో అని పందాలు, పొద్దున్న లేచాక సన్నాయి నొక్కులు.
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది,
అదిగో అనంతమైన జ్ఞానలింగం ఆద్యంతాలు లేకుండా పెరిగిపోతుంది.
సాయంత్రం దాకా వెలుగునిచ్చిన సూర్యుడు, కోటి సూర్యుల పగిది వెలిగే ఆ మహా సూర్యుని ముందు దివిటీ అయినాడు.
సృష్టి చేసే బ్రహ్మ మరో సృష్టికోసం వలసిన తేజస్సును తీసుకుపోవడానికి వచ్చాడా అన్నట్టు భక్తి ప్రపత్తులతో నిలబడి ఉన్నాడు
ఈ మహా శక్తేనా బాణుడితో యుద్ధమొనరించినప్పుడు, లీలగా నేనోడినానని పలికినవాడు, ఈ మహా శక్తేనా తన భక్తుడైన రావణుడిని పరాభవించి సీత జాడ తెలిపినదని అబ్బురపడి చూచుచుండె విష్ణుమూర్తి
ఈ తేజస్సే కదా సమస్త విద్యలకూ ఆలవాలమైన డమరుకాన్ని ధరించేదని సరస్వతీదేవి ఆశ్చర్యముగా చూస్తూ నిలబడి పోయింది.
ఈ తేజస్సే కదా పుత్రసముడివలే నన్నూ నా స్వామిని కలిపినదని సాగర గర్భసంభూత, సలక్షణ జాత, దేవదేవ దివ్యమహిషి అప్యాయతతో అలా చూస్తూ ఉండిపోయింది.
ఇంతటి స్వామిలో, తేజస్సులో, సగభాగాన్ని కదా అని ఆ తల్లి సర్వ మంగళ మాంగళ్య, సర్వార్ధ సాధకి, గౌరి అలా రెప్పవాల్చకుండా నిలుచుందిపోయింది.
మాకోసం కదా ఇంతటి స్వామి విషాన్ని మింగి గరళ కంఠుడయ్యాడని సకల దేవగణమూ, అలా నిలిచిపోయింది
నిను సేవింపగ నాపదల్పొడమీ, నిత్యోత్సవంబబ్బనీ, జనమాత్రుండననీ, మోహంబు పైకొననీ అంటూ శివసాయుజ్యాన్ని పొందిన భక్త కోటి అంతా పరవశిస్తూ గానం చేస్తున్నారు.
అది ప్రకృతి పరమశివుడి ఆద్యంత రహితమైన అద్భుతమైన రూపాన్ని కన్నులారా చూస్తూ, చెవులారా వింటూ తానై శివుడై, శివుడే తానౌతున్న క్షణం.
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
సూర్యుడివలె నిన్ను నువ్వు వెలిగించుకోవాలని, నలుగురికీ వెలుగునివ్వాలనీ లేదా అంటూ,
బ్రహ్మ వలె నువ్వు ఏం సృష్టించాలో చెప్పు అంటూ,
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
నీ కోసం నేను హనుమంతుడినవ్వడానికి సిద్ధం , నువ్వు రాముడవ్వడానికి సిద్ధమేనా అంటూ,
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
ఈ ఢమరు శబ్దమే నీలోంచి వస్తోంది విన్నావా, వినగలవా, వినడానికి సిద్ధమా అంటూ,
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
నిన్నూ నీలో ఉన్న నన్నూ కలిపేది నేనే, కలపగలిగేది నేనే, నువ్వు సిద్ధమా అంటూ,
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
నిన్ను నాలో సగం చేసుకోవడానికి నేను సిద్ధమే కానీ నీ మనసులో సగం కాదుకదా ఏ కొంచెమైనా ఖాళీ ఉందా ఉంటూ,
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
సకలదేవగణాల రక్షణకోసం విషం మింగినవాడిని నీకోసం ఏమీ చెయ్యలేనా, కానీ నోరు తెరిచి అడగవెందుకని అంటూ,
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
శివసాయుజ్య సాధనా చతుర అశేష మునిగణమూ, అసామాన్య భక్తిగణమూ నీకు నా సులభత్వాన్ని బోధపరచడంలేదా అంటూ
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
ప్రకృతి లో నువ్వు దేన్ని చూసినా నన్ను చూసినట్టే, చూస్తున్నట్టే, కానీ ఎందుకు ఒప్పుకోవడానికి సంకోచిస్తున్నావ్ అంటూ
Subscribe to:
Posts (Atom)


