Tuesday, October 27, 2009

ఇంకెన్నో రోజులు లేదులే మీ కోరిక తీరడానికి!

శ్రీ రామదూతం శిరసా
నమామి!

తెలుగు మెడలో ఈ
బోర్డ్ ఎప్పుడో పడింది.

ఈ రోజు కొత్తగా
బాధ పడడమెందుకు? మనం కోరుకున్నదేగా
జరుగుతున్నది. మన పిల్లలు తెలుగులో
మాట్లాడితే మనకే అవమానం.

"
అల
వైకుంఠపురం లో,జో అచ్యుతానంద
జోజో ముకుంద " లాంటి అచ్చతెలుగు
పదాలు, పద్యాల అందాలు ఇప్పుడు
అవసరం లేదు.
ఆకాశంలో మెరిసే
తారల గురించి కూడా ఇంగ్లిష్
లోనే చెప్పాలి,ట్వింకిల్ ట్వింకిల్
స్టార్ అంటూ.... చెప్దాం.
క్రిష్టియన్

స్కూల్లో పిల్లలు పెద్ద చదువులు(?) చదవాలి, దానికి తెలుగైతే ఏంటి, ఇంగ్లిష్ ఐతే ఏంటి అనే కదా చేర్పించాము
ఇప్పుడు ఏడవడం దేనికి?

ఎటూ మన పిల్లల్ని
వాళ్ళు తెలుగు చదవ నివ్వరు,మనమూ
చదవనివ్వము.,
పెద్దవాళ్ళకి తెలుగు

తప్ప ఇంకేది రాని కుటుంబాలు
ఇంకా కొన్ని ఉండడం చేత పిల్లలకు
, ఆ లు  అమ్మ,అత్త పదాలు వస్తున్నాయి.

ఈ పిల్లలకు అంతకు మించి తెలుగు

రాదు ఇరవయ్యేళ్ళకైనా, అరవయ్యేళ్ళకైనా . ఇక ఆ తర్వాతి తరానికి అసలు చన్సే
ఉండదు.
సో ఇంకొక్క తరమే మిగిలింది

తెలుగుని బతికించడానికైనా, చంపడానికైనా...


ఒక హారీ పోటర్
పిల్లలకి నచ్చుతుందంటే, అంతకి
మించి పిల్లల ఊహా శక్తిని, సృజనాత్మకతని
పెంచే కధలు మనకి లేవా?
(లేవు అని
ఇప్పుడు ఎవరూ అనకపోవచ్చు, కాని
భవిష్యత్తులో లేవని చెప్పే
రోజులు కచ్చితంగా వస్తాయి.)
కానీ చెప్పాలంటే మనకి రావాలి
కదా,
మనకి తెలిసినవన్నీ చేతన్

భగత్ పుస్తకాలూ, సిడ్నీ షెల్డన్
పుస్తకాలున్నూ , ఇక మనమేం చెప్తాం.

అందుకే టీచర్స్ కి వదిలేసి మనం

మాత్రం మన పిల్లల మెరుగైన భవిష్యత్తు
కోసం (డబ్బుంటే చాలా వ్యక్తి
వికాసం అవసరం లేదా) కష్టపడుతూ
ఉంటాం (?).
ఆ టీచర్స్ ఏం చెప్తున్నారో

మనకి తెలియదు.
మన పురాణాలు
,కావ్యాల
గురించి ఉండేదే ఒక తెలుగు పుస్తకంలో , అలాంటి తెలుగు ఒక క్రిష్టియన్
టిచర్ చెప్తే ఎలా ఉంటుందో అనుభవించి
బాధ పడాలే కాని చెప్పేది కాదు.

పార్వతీ కళ్యాణం చెప్పినా అదే

తంతు, శ్రీ కృష్ణుని బాల్య క్రీడలు
చెప్పినా అంతే. ఇవన్నీ మనకవసరం
లేదు.
ఇంకేం జరుగుతుంది ఇది

కాక. మనమలక్ష్యం చేసి చంపేసిన
తెలుగుకి వాళ్ళు ఇప్పుడు సమాధి
కడుతున్నారు...


తెలుగు బతకాలంటే
ఏం చెయ్యాలో అందరికీ తెలుసు, ఇలా చెయ్యండి, అలా చెయ్యండి
అని చెప్పల్సిన అవసరం లేదు అని
నా అభిప్రాయం.
ఇప్పుడు పెద్ద

పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు
చాలా మంది తెలుగు వాళ్ళు(తెలుగు
మీడియం) కారా?

Friday, October 9, 2009

నేనూ ఒక పద్యం రాసానోచ్.

శ్రీ రామదూతం శిరసా నమామి.
గజేంద్ర మోక్షం చదివిన తర్వాత నాకు కూడా ఆంజనేయస్వామి మీద ఒక పద్యం రాయలనిపించింది. మత్తేభమో, శార్దూలమో, చంపకమో, ఉత్పలమో కొడదాం అనుకున్నా
*ఫర్ క్విక్ రిఫరెన్స్
ఉత్పలమాల-భ ర న భ భ ర వ
చంపకమాల-న జ భ జ జ జ ర
మత్తేభం-స భ ర న మ య వ
శార్దూలం- మ స జ స త త గ (ఆటవెలది,తేటగీతి, కందం- పేర్లు మాత్రమే తెలుసు చందస్సు తెలియదు.). *

సరే కాన్సెప్ట్ కావాలి కదా... తీవ్రంగా బ్రైన్ ని ఆ భగవంతుడి గుణగణాల మీద కేంద్రీకరించి అలోచించాక నాకు తట్టిన మొదటి అలోచన ఆ రామదూత కు పెద తండ్రి అయిన యముడి విషయం. తదుపరి గుర్తొచ్చింది ఎవరినైనా ముంచగలిగిన సంసారమనే మృత్యుసాగరాన్ని అవలీలగా దాటిన విషయం. దాంతో దీన్నే పద్యంగా రాద్దాం అనుకున్నా. కాని ఇక్కడ ఒక చిక్కు వచ్చింది.యముడు హనుమ కి పెద నాన్న అయినది ద్వాపరంలో, కానీ సాగరాన్ని దాటింది త్రేతాయుగం లో. దానితో ఎలా రాయడమా అని తెగ అలోచించాను. ఏమీ తోచలేదు. నేనేమన్నా సహజ పాండితీ ప్రకర్ష ఉన్న పొతన్ననా, మామూలు పదాలతోనే పెద్ద పెద్ద పద్యాలు రాసెయ్యడానికి(జో జో కమలదలేక్షణ, జో జో మృగరాజ నయన జో జో-దశమ స్కంధం), లేకపోతె అజ్జాడ గారిలాగా సమయ స్పూర్తి ఉన్నవాడినా,(రాజుతో పేకాట ఆడుతూ రాజుకు మూడు ఆసులు , తనకు మూడు రాజులు వస్తే, పెద్ద పందెం పెట్టేసి ఆనక "ఏ ధైర్యం తో అంత పందెం పెట్టావంటే" రాజుల మీద నమ్మకంతో అని ఎస్కేప్ అయినట్టు అవ్వడానికి)
అందుచేత చివరికి నేను కూడా అర్జునుని బాణాన్నే నమ్ముకుని - పద్యం తెలిసిన వాళ్ళకి కవిత అని, తెలియని మా అశోక్, శశాంక్, అభి, కిరణ్(కిరణ్ కి కొంచెం తెలుసనుకుంటా),రెక్కల పక్షి(వింగ్ బర్డ్-వెంకట్)కి ఏ కందమో, ఆటవెలదో, తేటగీతో అని చెప్పెయ్యచ్చులే అని ఒక పద్యం రాసేసా.
ఇదుగో ---
సర్వతముడవు,సర్వోత్తముడవు
సర్వాత్ముడవు,సర్వము నీవై యుండన్
సర్వకాలములందు నమస్కరింతు
సర్వం సహా చక్రవర్తికి సరసీరుహాళికిన్
ఏంటి ఎక్కడో చదివినట్టు ఉందా (1-విశ్వకరు,విశ్వదూరుని,విశ్వాత్ము,విశ్వవేద్యు విశ్వునవిశ్వున్ శాశ్వతనజు బ్రహ్మ ప్రభు నీశ్వరునిన్ బరమ పురుషు నే సేవింతున్ 2-లోకంబులు లోకేశులు లోకస్ధులు దెగిన దుది నలోకంబగు పెంజీకటికవ్వలనెవ్వడేకాకృతి వెలుగుచునుండునాతని సేవింతున్ ... ఇలా ), ఒక వేళ మీరెక్కడన్న చదివినా అది నా తప్పు కాదు. ఎందుకంటే ఇది నా సొంతం......(ఏంటీ స్వామి నవ్వుతున్నావా నా సొంతమన్నానని-అంతేలే ఎందుకు నవ్వవు, గ్రామర్ పెద్దగా తెలియని నాకు ఒక పద్యం రాయాలని కోరిక కలిగించి చివరికి నేను రాయలేకపోతే నిరుత్సాహ పడకూడదని ఒక చిన్న పద్యం రాసేలా చేస్తే ఇప్పుడు నేను ఈ పద్యం నాదే అంటే నవ్వు రాదా).
నాది అని అన్నందుకు క్షమించు స్వామీ కానీ అలా అనడానికి కారణం ఉంది, అలా అనుకోకపోతే నీకు నైవేద్యంగా సమర్పిన్చుకోలేనన్న చిన్న ఆలోచన . అందుకే ఈ చిన్న ధిక్కారం.
కూర్చె భాగవతమొకరు నిను సేవించి కైవల్యమొంద,
తీర్చుకొనుటకు జన్మ జన్మంబుల కర్మ పాశములు కొంద
రర్చించె శతకములతో,అల్ప జ్ఞాన వశమున నే
కూర్చిన ఈ పదమాలనర్చించనిమ్ము నీ పాద పద్మంబుల
నా మొదటి పద్యం(సర్వతముడవు...) ఆ శ్రీ రామదూతకి అంకితమిస్తూ.......
శ్రీ రామదూతం శిరసా నమామి....
మంగళాశాసన పదైః మదాచార్య పురోగమైః
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం

Tuesday, May 19, 2009

హనుమత్ రక్షా యాగం పూర్ణాహుతి .





రవ్వవరం లో రెండు ఎకరాల సువిశాల క్షేత్రంలో నిర్మింప బడ్డ శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం లో హనుమత్ రక్షా యాగం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ యాగం ఇప్పుడు పూర్ణాహుతి దశకు చేరుకుంది. ఎక్కడెక్కడనుండో మీ సంకల్పాలను మాష్టరుగారు ఆ స్వామికి నివేదించి, రోజూ మన గోత్ర నామాలతో క్రమం తప్పకుండా పూజ ను నిర్వహిస్తూ వచ్చారు.ఆ స్వామి అనుగ్రహం చేత నేను రవ్వవరం లో వేంచేసి యున్న ఆ జగన్మాత ని, క్షేత్ర పాలకుడైన ఆ వాయునందనుడిని దర్శనం చేసుకోగలిగాను.ఎన్నో రకాలుగా పరీక్షలు పెట్టి ఆ స్వామి రవ్వవరం వెళ్ళడానికి నాకు అనుమతినిచ్చారు. పీఠం, యాగం అనగానే నేను ఏదో అనుకున్నాను. కానీ అక్కడకు వెళ్ళిన తర్వాత నా అభిప్రాయం మార్చుకున్నాను. చక్కటి ప్రదేశం, చూడగానే ప్రశాంతత మూర్తీభవించినట్లుండే పరిసర ప్రాంతాలు, పల్లెటురి ఆప్యాయతలు, అక్కడ దీక్ష తీసుకున్న బాల స్వాములు, అంతా కలిసి నా అనుభవాన్ని ఆనంద మయం చేసారు.వెళ్ళగానే స్నానాదికాలు పూర్తి గావించి స్వామికి పూజ చేసాము. తర్వాత యాగం లో పాల్గొన్నాము. ఆ తర్వాత ఆ పీటం గురించి , పూర్వ చరిత్ర గురించి చెప్పారు. ఆ తర్వాత బాలస్వాములతో మాటలు మొదలుపెట్టాం. మొదట కొంచెం దూరంగా మసలినా తర్వాత దగ్గరయ్యారు. దానికి తోడు నాతో పాటు నాగప్రసాద్ ఉండనే ఉన్నాడయ్యే. వాడుంటే పిల్లలు చాలా తొందరగా దగ్గరికి వస్తారు. అలా వాళ్ళు బాగా కలిసిపోయారు.వాళ్ళ మాటలు వింటూ ఉండగానే సాయంత్రం అయ్యింది.సరే పిల్లలందరినీ రమ్మనమని చెప్పి ఆటలాడాము.ఖో ఖో ఆడి కాలు బెనికించుకున్నాను. ఆ తర్వాత నాగప్రసాద్ పరిగెత్తకుండా ఆడే ఆటలు ఆడించడంతో ఊపిరి పీల్చుకున్నాను. తర్వాత సాయంత్రం మళ్ళీ పూజ, భజన జరిగింది. మాష్టరు గారి తాళజ్ఙానం అబ్బురపరిచింది.ఆదివారం రోజు ఇంకా ఆహ్లాదంగా గడిచింది. అక్కడున్న చెట్టూ,చేమా కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించాయి. దగ్గరిలో ఒక కొండ మీద కొండగురునాధ స్వామి ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళాము. మాకు తోడుగా కొంతమంది బాలస్వాములు వచ్చారు. ట్రెక్కింగ్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి రవ్వవరం ఆ చుట్టుపట్ల ఉన్న కొండలు కోరిక తీరుస్తాయి.ఆ తర్వాత ఊళ్ళో వెలిసిన వేణుగోపాల స్వామిని, శివున్ని దర్శించుకుందామనుకుంటే సమయాభావం చేత కుదరలేదు.
కుదిరితే మీరు కూడా పూర్ణాహుతి కి వెళ్ళడానికి ప్రయత్నించండి. చాలా బాగుంటుంది. ఏర్పాట్లు మాత్రం భారీ ఎత్తున జరుగుతున్నాయి. వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అనిపిస్తుంది. ప్రయత్నించండి. ౫౪ (54) రోజుల పాటు అఖండంగా జరిగిన ఈ దీక్షా కార్యక్రమాన్ని చివరి రోజైనా దగ్గరనుండి చూడాలనుకుంటే,చూడాలనుకుంటే ఏంటి పాల్గొనాలనుకుంటే మరెందుకు ఆలస్యం, వెంటనే irctc నో,RTC నో అడిగి వినుకొండ కి టికెట్ తీసుకోండి. ఆ స్వామి అనుగ్రహాన్ని పొందండి.




దూర ప్రాంతములో ఉండి ఇక్కడకు రాలేని పరిస్థితిలో ఉన్న వారి కోసం స్వామి వారి రక్షలను (ఉచితంగానే) పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. పోస్టల్ ఖర్చులు మాత్రం పంపించవలసి ఉంటుంది. ఇతర వివరాల కోసం ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలవరకు ఈ ఫోన్ లలో సంప్రదించండి. అందుబాటులో ఉంటాము.Phone numbers: 09948235641, 09940050078, 08646211717.




marinni ఫోటో లు తదుపరి టపాలో ................

Saturday, May 2, 2009

విజయేంద్ర జాతక కధలు-"మిత్రుడు"

బుద్ధుడి జాతక కధలు అని అప్పుడప్పుడూ మీరు వినే వుంటారు. ఇది మన విజయేంద్రుడి కలం నుండి జాలువారిన జాతక కధ. పోస్టర్ చూసిన తర్వాత ఫస్ట్ అనిపించింది ఏంటంటే శివలెంక కృష్ణప్రసాద్ కి ఈ సినిమా కొంచెం డబ్బులు మిగులుస్తుంది అని. టైటిలే కొంచెం మార్చి ఏ మూడు ముళ్ళ బంధం అనో ఏడడుగుల సంబంధం అనో పెట్టుంటే బాగుండు అనిపించింది. బహుశా విదేశంలో జరిగిన పెళ్ళికి అంత పవర్ ఉండదనుకున్నారేమో అందుకే టైటిల్ అవి తట్టినట్టు లేవు. ఇకపోతే బాలకృష్ణ ఈ సినిమాలో నిజంగా నటించాడు. ఒక్క మగాడిని అని అహంకరించకుండా స్క్రిప్ట్ లో ఉన్న మిగతా నటీనటులకి కూడా కనిపించే అవకాశం ఇచ్చాడు. ఇక కొయ్యడాలు, నరకడాలు ,భారీ భారీ డవిలాగులు లేకుండా మరి మన బొబ్బిలి సింహంతో సినిమా తీసినందుకు నిజంగా దర్శకుడి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఒక యంగ్ హీరో కి సరిపోయే కధతో ఆ కధలో బాలకృష్ణ ని పెట్టి బాలకృష్ణ ని యంగ్ గా చూపించగలిగిన(మరీ టూ మచ్ రాస్తున్నానా ,లేదు లే బాలకృష్ణ నిజంగానే యంగ్ గా ఉన్నాడు సినిమా లో) టీం నిజంగా ప్రశంసా పాత్రమే. సినిమా ఆద్యంతం ఒకే టెంపో మెయింటెయిన్ చేసాడు. టెంపో అంటే పెద్ద ఉద్దేశ్యం ఏమీ లేదండీ నాకు. బాలకృష్ణ సినిమా అంతా పాటలతో సహా ఒకేలా కనిపించాడు. మామూలుగా అయితే విజయేంద్రవర్మ క్లైమాక్స్ లాగా ప్రతీ సినిమాలోనూ పదీ ,పదిహేను రకాలుగా కనిపించేవాడు.ఇందులో అలా లేదు ఇందుకు దర్శకుడిని తప్పకుండా మెచ్చుకోవాలి. ఇక ద్రోణ తర్వాత సినిమా అయినా కూడా దర్శకుడు ప్రియమణిని కంట్రోల్ లో ఉంచాడు. అందుకు ఒక ఓ ! డైరెక్టర్ కి ,.



ఇక ఇప్పుడు విషయంలోకి (నా బొంద విషయం ఏముంది చెప్పడానికి. సినిమా చూసిన వాళ్ళకి టైటిల్ చూడగానే అర్ధం అవుతుంది. సినిమా చూడని వాళ్ళకి ఎటూ నేను స్టొరీ చెప్పబోవడం లేదు కాబట్టి అర్ధం కాదు.)సరే విషయం టూకీగా చెప్తాను అర్ధం చేసుకోగలిగినవాళ్ళు చేసుకోండి. లేదంటే సినిమా చూడండి.


ఓ యాక్సిడెంట్-కొన్ని చావులు-ఒక జాతక ( దోషం unna ) ప్రేమకధ- ఒక చావుకై ,తోడుకై వెతుకులాట (కంగారు పడద్దు చావులో తోడు అని కాదు , చావక పోతే,చావు రాకపోతే బతకాడిని తోడు అని అర్ధం) - అదీ స్టోరి .


ఒక వేల మీరీ టపా చదివి సినిమాకెల్తే మాత్రం బయటకు వచ్చాక కూడా మీకు కూడలీ,జల్లెడా నా బ్లాగూ తప్పకుండా గుర్తుంటాయి నాదీ పూచీ.



ఎనీ క్వశ్చన్స్:


-- ఈ టపాకి మీ టైటిల్ కీ సంబంధం లేదు అని నా ఆబిప్రాయం ,దీనికి మీ సమాధానం?


సమా: సర్లే పెద్ద చెప్పొచ్చావు కాదు కాదు అడగొచ్చావు తెలుగు సినిమా టైటిల్స్ కి , సినిమాలకీ ఉంటున్న సంబంధం కంటే ఎక్కువే వుంది .అయినా అడిగావు కాబట్టి నీకింకో విషయం చెప్తా. సినిమా చూసి బయటకు రాగానే సినిమా పోస్టర్ చూసి నేను అన్న మొదటి మాట ఇదే . అందుకే ఇదే టైటిల్ అంతే.

విజయేంద్ర జాతక కధలు-"మిత్రుడు"

బుద్ధుడి జాతక కధలు అని అప్పుడప్పుడూ మీరు వినే వుంటారు. ఇది మన విజయేంద్రుడి కలం నుండి జాలువారిన జాతక కధ. పోస్టర్ చూసిన తర్వాత ఫస్ట్ అనిపించింది ఏంటంటే శివలెంక కృష్ణప్రసాద్ కి ఈ సినిమా కొంచెం డబ్బులు మిగులుస్తుంది అని. టైటిలే కొంచెం మార్చి ఏ మూడు ముళ్ళ బంధం అనో ఏడడుగుల సంబంధం అనో పెట్టుంటే బాగుండు అనిపించింది. బహుశా విదేశంలో జరిగిన పెళ్ళికి అంత పవర్ ఉండదనుకున్నారేమో అందుకే టైటిల్ అవి తట్టినట్టు లేవు. ఇకపోతే బాలకృష్ణ ఈ సినిమాలో నిజంగా నటించాడు. ఒక్క మగాడిని అని అహంకరించకుండా స్క్రిప్ట్ లో ఉన్న మిగతా నటీనటులకి కూడా కనిపించే అవకాశం ఇచ్చాడు. ఇక కొయ్యడాలు, నరకడాలు ,భారీ భారీ డవిలాగులు లేకుండా మరి మన బొబ్బిలి సింహంతో సినిమా తీసినందుకు నిజంగా దర్శకుడి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఒక యంగ్ హీరో కి సరిపోయే కధతో ఆ కధలో బాలకృష్ణ ని పెట్టి బాలకృష్ణ ని యంగ్ గా చూపించగలిగిన(మరీ టూ మచ్ రాస్తున్నానా ,లేదు లే బాలకృష్ణ నిజంగానే యంగ్ గా ఉన్నాడు సినిమా లో) టీం నిజంగా ప్రశంసా పాత్రమే. సినిమా ఆద్యంతం ఒకే టెంపో మెయింటెయిన్ చేసాడు. టెంపో అంటే పెద్ద ఉద్దేశ్యం ఏమీ లేదండీ నాకు. బాలకృష్ణ సినిమా అంతా పాటలతో సహా ఒకేలా కనిపించాడు. మామూలుగా అయితే విజయేంద్రవర్మ క్లైమాక్స్ లాగా ప్రతీ సినిమాలోనూ పదీ ,పదిహేను రకాలుగా కనిపించేవాడు.ఇందులో అలా లేదు ఇందుకు దర్శకుడిని తప్పకుండా మెచ్చుకోవాలి. ఇక ద్రోణ తర్వాత సినిమా అయినా కూడా దర్శకుడు ప్రియమణిని కంట్రోల్ లో ఉంచాడు. అందుకు ఒక ఓ ! డైరెక్టర్ కి ,.


ఇక ఇప్పుడు విషయంలోకి (నా బొంద విషయం ఏముంది చెప్పడానికి. సినిమా చూసిన వాళ్ళకి టైటిల్ చూడగానే అర్ధం అవుతుంది. సినిమా చూడని వాళ్ళకి ఎటూ నేను స్టొరీ చెప్పబోవడం లేదు కాబట్టి అర్ధం కాదు.)సరే విషయం టూకీగా చెప్తాను అర్ధం చేసుకోగలిగినవాళ్ళు చేసుకోండి. లేదంటే సినిమా చూడండి.

ఓ యాక్సిడెంట్-కొన్ని చావులు-ఒక జాతక ప్రేమకధ- ఒక చావుకై ,తోడుకై వెతుకులాట (కంగారు పడద్దు చావులో తోడు అని కాదు , చావక పోతే,చావు రాకపోతే బతకాడిని తోడు అని అర్ధం) - అదీ స్టోరి .

ఒక వేల మీరీ టపా చదివి సినిమాకెల్తే మాత్రం బయటకు వచ్చాక కూడా మీకు కూడలీ,జల్లెడా నా బ్లాగూ తప్పకుండా గుర్తుంటాయి నాదీ పూచీ.


ఎనీ క్వశ్చన్స్:

-- ఈ టపాకి మీ టైటిల్ కీ సంబంధం లేదు అని నా ఆబిప్రాయం ,దీనికి మీ సమాధానం?

సమా: సర్లే పెద్ద చెప్పొచ్చావు కాదు కాదు అడగొచ్చావు తెలుగు సినిమా టైటిల్స్ కి , సినిమాలకీ ఉంటున్న సంబంధం కంటే ఎక్కువే వుంది .అయినా అడిగావు కాబట్టి నీకింకో విషయం చెప్తా. సినిమా చూసి బయటకు రాగానే సినిమా పోస్టర్ చూసి నేను అన్న మొదటి మాట ఇదే . అందుకే ఇదే టైటిల్ అంతే.

Tuesday, April 21, 2009

రెండున్నరేళ్ళుగా అందని ద్రాక్షగా మిగిలిన ఆ స్వామి దర్శనం.

శ్రీ రామదూతం శిరసా నమామి
నేనుండేది లింగంపల్లిలో, ఉద్యోగం ఐఐఐటి దగ్గర. ఆటో లో పావుగంట ప్రయాణం. ఎప్పుడైనా స్నేహితులుంటే బైక్ మీద వెళ్ళేవాడిని. గుల్ మొహర్ పార్క్ దాటిన తర్వాత అలిండ్ కి ముందు ఒక ఆంజనేయ స్వామి గుడి ఉండేది. కొంచెం ఎత్తులో ఉండేదేమో దారిన పోతుంటే మూల విరాట్టు స్పష్టంగా కనపడేది. 2006 ఆగస్ట్ నుండి ఆ గుడి కి వెళ్దామని ఉండేది. కాని ఎపుడూ కుదరలేదు. మధ్యలో ఆటొ దిగి మల్లీ ఇంకొక ఆటో పట్టుకొని రావాలి. దానికి తోడు షూ విప్పాలి. ఇవన్నీ పెద్ద ప్రతిబందకాలు గా అనిపించేవి. దాంతో మనసులోనే "అతులిత బలదామం "అనుకుంటూ ఉండేవాడిని. దానికి తోడు తారక మంత్రం ఉండనే ఉంది "దేవుడు అని మనసులో ఉంటే చాలు చూపించక్కరలేదు అని". అదేంటో నగా నట్రా చూపించాలి కానీ భక్తి మాత్రం ఎవరన్నా ఉంటే బయటికి రాకూడదు ఎందుకో . సీరియస్ గా అనుకునేవాడిని, బండి కొనుక్కున్నాక రోజూ వెళ్ళాలి అని అనుకునేవాడిని. కానీ కొన్నదీ లేదు వెళ్ళిందీ లేదు. కొన్నాళ్ళు మా శశాంక్ తో కలిసి బైక్ మీద ఆఫీస్ కి వచ్చాను కాని ఎప్పుడూ గుడికి వెల్దాం అని అడగలేదు. కొన్నిసార్లు ఇంటి దగ్గర తొందరగా బయలుదేరి గుడి దగ్గర దిగుదాం అనుకున్నా. కానీ అలా అనుకున్న ప్రతిసారి ఇంకా లేటయ్యేది. కొన్నాళ్ళు ఏదేమైనా ఈరోజు మర్చిపోకుండా దిగాలి అనుకునేవాడిని. ఆ రోజు ఆటోలో ఉన్నప్పుడు ఏదైనా ఫోన్ రావడమో లెదా నేనే ఎవరికైనా ఫోన్ చెయ్యాల్సి రావడమో జరిగేది.ఇంకొన్ని సార్లు ఆటోలో నిద్రపోయేవాడిని, లేచి చూస్తే ఏ యూనివర్సిటీ దగ్గరో తేలేవాడిని.
కానీ ఈ రోజు అర్ఢమైంది. స్వామి కావాలనే నన్ను అక్కడికి దూరంగా ఉంచారని. విషయం ఏంటంటే బి.టెక్ లో ఉన్నప్పుడు నేను సుందరకాండ పారాయణ పుస్తకం కొన్నాను కాని ఎప్పుడూ తెరిచిన పాపాన పోలేదు. కాలగమనంలో నాహం కర్తా హరిః కర్తా పుస్తకం చదవడం, వేయిపడగలు చదవడం జరిగింది కానీ సుందరకాండ మాత్రం తెరవలేదు. అలాగే నాతో పాటు ఉద్యోగం కోసం నా వేయి పడగలు, సుందరకాండ , భగవద్గీత హైదరాబాద్ చేరాయి. వేయి పడగలు మళ్ళీ రెండు సార్లు చదివాను కానీ సుందరకాండ మాత్రం చదవలేక పోయాను. ఇలా కాదని ఎం.స్. రామారావు గారి తెలుగు సుందరకాండ ఆడియో సంపాదించాను. కాని అదేంటో నా దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి పాటల్లో ఇప్పటివరకూ ఒక్కసారి కూడా వినకుండా ఉన్నది అదొక్కటే . దానితో ఇక సుందరకాండ గురించి మనకు తెలియడం ఈ జన్మలో జరగదేమో అనుకుంటున్న తరుణంలొ తెలుగు డివోషనల్ స్వరాంజలి బ్లాగు చూసాను . అక్కడ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి "హనుమధ్వైభవం" ప్రవచనం వినడం జరిగింది. ఆ తర్వాత సురస సైట్ గురించి తెలిసింది. అక్కడ ఉషశ్రీ గారి రామాయణం విన్నాను. దాని తర్వాత హనుమజ్జయంతి సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచ్చిన ఒక ప్రవచనం ఇంటర్నెట్లో విన్నాను. ఆ తర్వాత వారిచ్చిన రామాయణాంతర్గత సుందరకాండ ప్రవచనం అంతర్జాలంలో విన్నాను. ఏడు రోజుల ప్రవచనం, రోజుకు రెండు గంటలు చొప్పున . ఇది పూర్తి గా వినడానికి కూడా లెక్కలేనన్ని అవాంతరాలు. ఒక అవాంతరం తర్వాత మళ్ళీ కొత్తగా వినడం మొదలుపెట్టడం , మళ్ళి అనుకోని విధంగా ఇంకొక అవాంతరం రావడం ఇలా ఎంతవరకు వెళ్ళిందంటే కేవలం సముద్ర లంఘనమే ఐదారు సార్లు విన్నాను. తర్వాత అలోచించుకుంటే ఆ భగవతుడే కావాలని, ఆత్మ దర్శనానికి ఎన్ని అవరోధాలుంటాయో చెప్పడానికే అలా చేశారనిపించింది. ఒక పక్క హనుమత్ రక్షా యాగం మర్చి పోయాననే బాధ , ఇంకొక పక్క నాలుగేళ్ళుగా ప్రయత్నిస్తున్నా సుందరకాండ ఎందుకు తెలుసుకోలేక పోతున్నానే సందేహం, ఈసారి ఎలాగైనా విని తీరాలన్న పట్టుదల , పైన ఆ పవనసుతుని కృప చేత నిన్నటికి ఆ ప్రవచనం వినడం పూర్తి చేయ గలిగాను. ఆ ప్రవచనం గురించి చెప్పాలంటే ఇంకొక పది టపాలు రాయాలి అంత అధ్భుతమైన వాగ్ధాటి,ప్రఙ్ఞ,కౌశలం ఉన్న పండితులు కోటేశ్వరరావు గారు. నిన్నటికి ప్రవచనం వినడం పూర్తి అయ్యింది, చూసుకుంటే సోమవారం. నేను మొదలుపెట్టింది ఒక మంగళవారం (చాలా మంగళవారాల క్రితం) అనుకోని విధంగా మంగళవారానికి పూర్తి అవ్వడం వెనుక ఆ స్వామి నాకు ఏమైనా చెప్పదలచుకున్నారా అనిపించింది. సరే మంగళవారం, సుందరకాండ వినడం పూర్తి అయ్యింది కదా ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాం అనుకున్న. అనుకోగానే గుల్ మొహర్ పార్క్ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడి గుర్తొచ్చింది. సరే ఎలాగైనా మధ్యలో దిగి గుడి లోకి వెళ్ళాలి అనుకున్నా. అనుకోవడం ఐతే అనుకున్నా కానీ మనసులో భయంగానే ఉంది ఆ స్వామి అనుమతి ఉందో లేదో అని . ఎందుకంటే ఎన్నో సార్లు మనసులో గట్టిగా అనుకుని అక్కడ దిగకుండా వెళ్ళిపోయిన సందర్భాలు ఈ రెండేళ్ళలో చాలా ఉన్నాయి కదా. సరే చూద్దాం ఆ స్వామి ఏం రాసిపెట్టారో అని వేయి పడగల్లో గణాచారి పూర్వీకుడు ప్రాణాలని అప్రమత్తతకి వెలకట్టి జాగరూకతతో ఆవుని వెతకడానికి పోయినట్టు , బయలుదేరాను. ఆటో ఎక్కి బయలుదేరాను నరాలు తెగిపోయేటంత టెన్షన్ గా ఉంది- దిగుతానో దిగనో , మర్చిపోతానేమో , నిద్ర పోతానేమో, ఎవరన్నా ఫోన్ చేస్తారేమో అని . చివరికి ఎలాగో గుడి ముందు "ఇక్కడ ఆపు బాబూ" అనగలిగాను.ఇప్పటికీ నాకు డౌటే నేనన్నానో , ఆ స్వామి అన్నారో. దిగిన తర్వాత చాలాసేపు నన్ను నేనే నమ్మలేకపోయాను. ఆ తర్వాత దర్శనం చేసుకున్నాను. అప్పుదు తెలియలేదు కానీ ఇప్పుడు మళ్ళీ మొత్తం గుర్తు తెచ్చుకుంటే ఆ స్వామి "ఇందుకే నువ్వింతవరకూ ఈ గుడికి రావడం కుదరలేదు" అని చిద్విలాసంతో అన్నట్టనిపిస్తోంది. సుందరకాండ ప్రవచనాన్ని విన్నందుకు ఆ స్వామి నాకు ఇచ్చిన బహుమానం "రెండున్నరేళ్ళుగా అందని ద్రాక్షగా మిగిలిన ఆ స్వామి దర్శనం" .
ఆ స్వామి అనుగ్రహ ప్రసాదాన్ని మీతో పంచుకుందామని చేసిన చిన్న ప్రయత్నం ఇది. మొదలు పెట్టినపుడు ఇంత రాస్తానని కానీ రాయాలని కానీ అనుకోలేదు. కానీ ఆ అంజనీ సుతుడు తోడుండి రాయిస్తుంటే రాయగలిగాను.

Friday, April 17, 2009

ఎవరు వేసారు వోటు ?

ఒక విడత ఓటింగ్ అయిపోయింది. కానీ ఎంతమంది ఓటేసారు?సెలవు లేదో లేదో అని గోలెట్టేసారు. ఇచ్చారు. కానీ ఏం లాభం. చదువుకోని వాళ్ళు చాలావరకు ఓటేసారు. పడని 35% ఓట్లలో 99% చదువుకున్న వాళ్ళవే అని నా నమ్మకం. చదువుకుంటే కాకరకాయ కీకరకాయ అయినట్టు ఉంది.

మొత్తం జనాభాలో 60% కి ఓటుహక్కు ఉందనుకుంటే , అందులో 60% జనాభా ఓటుహక్కును వినియోగించుకుంటే ఎంతమంది ఓటేసినట్టు? (36%) అంటే వందకి 36 మంది మీద ఆధారపడిన ఈ దేశ భవిష్యత్తు ని విమర్శించడానికి మాత్రం అందరూ ముందే. ఎందుకీ దుస్ధితి. దీనికి కారణం ఎవరు? నిరక్షరాస్యులా, నిస్సందేహంగా కాదు. అక్షరాస్యులమని, ఆధునికులమని చెప్పుకునే వాళ్ళే.