Monday, February 16, 2009
మినీ కధ
మొదటివ్యక్తి: ఇంతకు ఇతను ఏం వదిలిపెట్టి వెళ్ళాడు తన వాళ్ళకి?
రెండవ అతను: "అంతా" .
యండమూరి "వీళ్ళనేం చేద్దాం ?" నుండి
Friday, February 13, 2009
దశ రూపకం- ౯ వ (తొమ్మిదవ) భాగం
౦౫ -౧౨ -౩౮ .
రసరాట్టు గారూ! క్షమించాలి. మా నాన్న గారు ఉత్తరం రాసారు. రేపో నేడో ఇక్కడికి వచ్చేస్తార్ట. ఒక పని జరిగిందట. నాలుగైదు రచనలు మానాన్నగారు తమ బోంట్లకి విడివిడిగా అభిప్రాయంకోసం పంపించారట.అందులో ఒకటి శ్రీనాధుని రచన కూడా ఉందట. కడం అభిప్రాయాలన్నీ వచ్చేశాయి. ఒక వేళ, దిక్కుమాలి ప్రాలుద్ధం,మీకు నే పంపింది అదే కావచ్చు!
గోపి.
జవాబు
౦౬ -౧౨ -౩౮
రసరాట్
Thursday, February 12, 2009
దశ రూపకం - ౮(ఎనిమిదో) వ భాగం
03-12-38.
గోపి.
౦౪-౧౨-౩౮
గోపీ! ఈ సంగతి రాశావు నయమే. ఇంకాదాచుగుని ఊరుకున్నావుకావు,చచ్చిపోదుం. నాకూ అనిపించింది,'ఏమిరా! కొన్ని లక్షణాలు ప్రశంసార్హంగా కనిపిస్తూఉన్నా, ఈ రచన మొత్తంమీద ఏడిసినట్టుందేమిటీ అని. అల్లా అనిపించడానికి కారణం ఇప్పుడు భోదపడ్డది.
ఇంత దరిద్రగొట్టురచన భూమిమీదగాని,అంగారకుడులో గాని లేదు. బుద్ధిగల వాడెవడూ ఇది చివరంటా చదవడు. అందుకనే నే చదవలేదు. ఇందులో, గాఢంగా చూస్తే, అర్ధం వ్యర్ధం,భావం అభావం,రసం నీరసం,శైలిగాలి,భాషఘోష ,రీతి కోతి, వృత్తి మిత్తి,శయ్య కొయ్య,ధార నార. కొన్ని పట్ల కవి ఏడవబోయాడు. ఆ ఏడుపు ఉచితరీతిగా-అనగా ఏడుపు ఏ రీతిగా ఊండాలో అల్లా లేదు. నన్నడిగితే నేనేనా చెబుదును. చాలా బేస్ధలాల్లో కూడా నవ్వు తెప్పించడానికి ప్రయత్నించి రచయిత చచ్చి చెడ్డాడు.నేనెంత బిగపట్టుగుని కూర్చున్నా ప్రాణంమీది కొచ్చింది గాని నవ్వు రాలేదు. సహజమైన మాటపొందికా సమయస్ఫూర్తీ ఇందులోమృగ్యం. రచననీ , రచయితనీ వేరువేరుగా పుఠాలేసినా ఈ రచన ఇంతే. నుడికారం సుడిలో పడింది, కారకం మారకం చెందింది. నాబోటి గొప్పవాళ్ళనీ కొన్ని గొప్పసంస్ధల్నీ నిరసించడం తప్ప ఇతరం ఏమీ ఇందులో లేదు. ఈ రచనలో కొంత-చిరవదాకా అసలే చదవలేకపోయాను!-చదివి నేను చాలా పాడైపోయాను. నే కాక తక్కినవాళ్లు చదివితే ఎక్కడ చెడిపోతారో అని బెంగతో తీసుగుంటున్నాను. ఇది ఎవరేనా చదివితే పెద్ధ ఒట్టు; జాగ్రత్త!
రసరాట్
Wednesday, February 11, 2009
అహం బ్రహ్మాస్మి(నువ్వు దేవుడిని నమ్మితే దెయ్యమూ ఉంటుంది).
ఏంటి అయ్యేది రెండూ వేరే వేరే సినిమాలకు సంబందించినవి అంటారా ఐతే మీరు గ్రేట్. నిజమే "అరుంధతి" ,"నేను దేవుడిని " ఈ రెండు సినిమాల గురించే రాద్దాం అనుకున్నాను.
జనరల్ గా నేను సమీక్షలు చదవను(అప్పుడప్పుడూ తప్ప). ఇక మా శశి ప్రతి సినిమా కి రివ్యూ చదువుతాడు . అలాగని రివ్యూలని అధారం చేసుకుని సినిమాలు చూస్తాడనుకుంటే పప్పులో కాలేసినట్టే.తను అధమం విడుదలైన ప్రతి సినిమా చూస్తాడు. అలాంటిది "నేను దేవుడిని" చూసావా అని అడిగితే సౌండ్ లేదు, ఏమంటే సినిమా చూడలేమంట, రివ్యూ రాసినతనే వాంతి చేసుకున్నాడట, నేను చూడను అన్నాడు. నిజంగానే చూడలేదు కుడా. మా వాడు చూడను అన్నాడంటే ఏదో పెద్ద కధే ఉండి ఉంటుంది అని నేను పోయిన శుక్రవారం తిన్నగా శశికళ దియేటర్ కి వెళ్ళి సెకండ్ షో చూసి వచ్చాను.
ఆ తర్వాతి ఆదివారం అంటే నిన్న అనుకోకుండా అరుంధతి కి వెళ్ళాడం జరిగింది. ఇక అప్పుడు మొదలైంది నా ఆత్మ సంఘర్షణ. అదేంటి అరుంధతి ఆహా,ఒహో అన్నారే! బ్లాగ్లోకంలో ఒక్కరు తప్ప అంతా ఆ సినిమా ని నెత్తికేంటి,బ్లాగుల కెత్తుకున్నారే! అలాంటిది నాకేంటి ఈ సినిమా పరమ దరిద్రంగా కనిపిస్తుంది. అలాగే నేను దేవుడిని బాలేదన్నారే , కానీ ఇదేమో నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకా అని ఆలోచించగా కొన్న్ని విషయలు కనిపించాయి.
1)బహుశా బాల సినిమాలో అఘోరాలంటే దైవ ప్రతిరూపాలుగా,దేహానికి ప్రాణానికి మధ్య గిజగిజలాడే ఆత్మకి మోక్షాన్ని ప్రసాదించే వాళ్ళుగా చూసి అరుంధతి లో వాళ్ళని క్షుద్రోపాసకులుగా, నీచమైన చేతబడులు, బాణామతులు చేసేవాళ్ళుగానూ చూపించడం వల్లనేమో అనిపించింది. కానీ అలోచించగా ఇంకా చాలా క(అ)నిపించాయి. నేను ఎక్కడో ఒక పుస్తకంలో అఘోరాలను గురించి చదివాను(బహుశా యండమూరి అనుకుంటా).దానిలో వాళ్ళు కాల స్వరూపులని,దేనికి కట్టుబడని వాళ్ళని రచయిత చెప్తే కామోసనుకున్నాను.
2)అరుంధతి సినిమా అంతా రక్తం,విపరీతమైన రక్తం. అదేంటో అంత రక్తం చూసినా జుగుస్స కలుగలేదు కానీ వాస్తవ జీవితాన్ని చూస్తే (చూపిస్తే) మాత్రం జుగుస్సాకరంగా ఉందనడం హాస్యాస్పదమనిపించింది(ఈమాట రాసేటప్పుడు నా మిత్రుడన్నమాట: "బట్టలు విప్పి రికార్డింగ్ దాన్స్ చేస్తే చూడగలం కానీ, బట్టలు లేని వాళ్ళు రోడ్డు పక్కన పడి ఉంటే చూడలేం కదరా ఇదీ అంతే").
మొదటినుండీ మనకు ఒక అలవాటు ఉంది అదుగో పులి అంటే ఇదిగో తోక అనే అలవాటు.చూడబోతే ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగిందేమో అనిపిస్తోంది.ఒకడు ఈ సినిమా చూస్తే కళ్ళు తిరిగుతాయి అంటే ఇదో నాకు తిరుగుతున్నాయి అని పదిమంది అంటే వందమందికి అలా అనిపించడంలో అసందర్భమేముంది?
అయినా బాలకి బుద్దుండాలి ప్రజలు తాము కుందేళ్ళకోసం కొండలెక్కలేకా,పారాషూట్ లేసుకుని పాకిస్తాన్ కి వెళ్ళలేకా సినిమాలకి వస్తారు తప్ప గుడ్డివాళ్ళని,కుంటివాళ్ళని మూగవాళ్ళని చూడడానికి కాదనీ,
Friday, February 6, 2009
వేయి పడగల నీడలో నేను-2(గిరిక)
వేయి పడగలు నన్ను రెండు విధాలుగా మార్చింది.ఒకటి-ఆధ్యాత్మికంగా,రెండు -వ్యక్తిగా .
వ్యక్తిగతమైన అభివృద్ధిని ఇంకొక టపాలో వివరిస్తాను.
మొదట ఆధ్యాత్మికంగా -
దైవానికి నాకు దూరం పెరుగుతోంది అని మొట్టమొదటి సారి బి.టెక్ లో ఉన్నప్పుడు అనిపించింది.ఎందుకు,ఎవరి వల్ల అని చాలా ఆలోచించాను.నా వల్లైతే కాదు అని ఒక సారి, ఏం జరిగినా నా వల్లే జరిగి ఉంటుంది అని ఒక్కొక్కసారి అనిపించేది. ఆ సమయంలోనే వేయి పడగలు చదివాను.
మహాతల్లి గిరిక నా మనసును కదిలించింది.నాకు మళ్ళీ మార్గనిర్దేశం చేసింది.అప్పుడే మహాతల్లి గిరికతో పాటు ధర్మరావు గారిని నేను కూడా గురువుగా మనసా స్ధాపించుకొన్నాను.నేను కూడా కళ్యాణోత్సవాలకోసం వేయి కన్నులతో ఎదురుచూశాను.వేయిపడగలు పుస్తకం అంతా ఒక ఎత్తు వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవాలు ఒక ఎత్తు.సుబ్బన్నపేటలో నాగేశ్వర స్వామిని మొదటసారి చూసినప్పుడు అరుంధతికి కలిగిన అనుభూతి లాంటిది కలిగింది ఆ కళ్యాణోత్సవాలు చదువుతుంటే. ఎన్ని సార్లు చదివినా జరిగిన పెళ్ళిని మళ్ళీ వీడియో లో చూస్తున్న అనుభూతే కలిగేది.పదకొండు రోజుల కళ్యాణోత్సవాలు, దశావతారాలు . ఉత్సవాలు పూర్తయ్యేసరికి స్వామి అన్ని అవతరాలను నా కళ్ళ ముందే ధరించినట్లనిపించింది. మనకు ఒక కల్పం బ్రహ్మ కు ఒక రోజు ఎలా అవుతుందో అనుభవపూర్వకంగా తెలిసింది. ఎందుకంటే సుబ్బన్నపేటలో పదకొండు రోజులు అనంతపురంలో మూడు రోజులే అయ్యాయి కదా.
గిరికాదేవి మత్స్యరూపిణి అయినపుడు ఆమెతో కలిసి స్వామి కోసం సాగరగర్భాన్ని శోధించాను. గిరికా దేవి కూర్మరూపిణి అయినపుడు స్వామి ఎక్కడ మంధర పర్వతాన్ని మోయలేక కందిపోతాడో అని ఆమెతో పాటు నేను తల్లడిల్లాను. ఇలా ప్రతి అవతారంలోనూ గిరిక తోపాటు నేను ఆ స్వామికోసం ఎదురుచూసాను.
కళ్యాణోత్సవాల ముగింపురోజున స్వామి గిరికతోపాటే నన్ను అనుగ్రహించాడు.నా చర్మచక్షువులకి ఙ్ఞాన దృష్ఠిని ప్రసాదించాడా అనిపించింది.
నేను నీకెప్పుడూ దూరంగా వెళ్ళలేదు, "యతోభావ: తతో దృష్టి:" -అన్న స్పష్టమైన సందేశం క(వి)నిపించింది.
అనుభవైక వైద్యమైన ఈ అనుభవాన్ని అక్షరరూపంలో పెట్టాలని నేను ఎంత ప్రయత్నించినా చేయలేకపోయాను.నాచేతనైనంత ప్రయత్నించాను ఏమైనా ఉంటే విఙ్ఞులు సరిదిద్దగలరు.
Thursday, February 5, 2009
దశ రూపకం -౭ వ భాగం
మందపిల్లి.
౦౧ -౧౨ -౩౮.
రసరాట్టుగారూ!
మీ పేర వ్రాయడం ఏ ముహూర్తాన్ని ప్రారంభించానో గాని సంగతి తెమిలేటట్టు కనపడదు. మరో చిక్కొచ్చింది. పొద్దున్న ఒకాయన నే ఉండగానే మా ఇంటికొచ్చారు. ఆయన పేరు ఘంటారవుట. ఆయనట తన రచన మా నాన్నగారికిచ్చింది. మీకు నేను పంపిన రచన తనదేనని ఆయన పట్టు పడుతున్నాడు. వెనక మీ ఎన్నికల్లో మీ తరఫున పని చేసింది ఈయనేట.
గోపి.
జవాబు
౦౨ -౧౨ -౩౮
రసరాట్.
దశ రూపకం - ౬వ భాగం
మందపిల్లి.
౨౯ -౧౧ -౩౮ .
గోపి.
౩౦ -౧౧ -౩౮
రసరాట్

